twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ నిర్మాత బ్లాక్ మెయిల్!?

    By Staff
    |

    Singanamala Ramesh
    పులి, వరుడు చిత్రాలు రూపొందిస్తున్న శింగనమల రమేష్ గత కొద్దిరోజులుగా బ్లాక్ మెయిల్ కి గురి అవుతున్నాడని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ విషయంపై ఆయన తండ్రి నిర్మాత, ఫైనాన్సియర్ శింగనమల సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ తన కుమారుడు గత కొద్ది రోజులుగా అనంతపురంకి చెందిన కొందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. ఉన్న బకాయిలు తీర్చివేసామని, అయినా బెదిరింపులు తగ్గటం లేదని అంటున్నారు. కొందరి వ్యక్తుల అసూయ తన కొడుకుని ఇబ్బందిపెడుతోందన్నారు.

    ఈ విషయంపై రమేష్ ప్రేస్ మీట్ పెడదామని మొదట అనుకున్నా ఆ ఇంపాక్టు సినిమాలపై పడే అవకాశముందని ఆగారని చెప్పారు. అలాగే పులి,వరుడు చిత్రాలు ఏ అడ్డంకి లేకుండా కొనసాగుతాయని ఆయన అన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు మాత్రమే కాక త్వరలో విశాల్ తో ఓ చిత్రం కూడా ప్రకటించటానికి ప్లాన్ చేస్తున్నామన్నారు.

    ఇక శింగనమల రమేష్ కొద్ది రోజులుగా కనపడలేదంటూ వార్తలు అంతటా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఈ న్యూస్ ఓ డైలీలో వచ్చిందని సమాచారం. ఇక అతనికి ఈ చిత్రాల నిర్మాణం కోసం రుణాలు ఇచ్చిన వారు వడ్డీల చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారని వినపడుతోంది. అయితే మొదట్లో కరెక్టుగా కట్టిన రమేష్ కొద్ది నెలలుగా ఇవ్వటం లేదని దాంతో వారు చాలా అప్ సెట్ అయ్యారని అంటున్నారు. అందుకే ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X