Don't Miss!
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పవన్ ‘పులి’ ని అడ్డుకుంటే ‘ఉరి’ తప్పదు!??
గత కొన్ని రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం 'కొమరం పులి" గురించి వస్తున్న విషయాలపై ఆ చిత్ర యూనిట్ కాస్తంత ఆందోళన చెందుతుందని సమాచారం..తెలంగాణలో చిత్రాన్ని అడ్డుకుంటామని..తెలంగాణ విద్యార్థి జేఏసి, కోదండరామ్ లు తెలుపుతున్నారు. ఈ చిత్ర నిర్మాత ఆ విషయం వింటే చాలు భయపడుతున్నాడని సమాచారం. కారణం ఇప్పటికే ఈ చిత్రానికి భారీ బడ్జెట్ ఖర్చయిందని. ఈ చిత్రం ప్రారంభించి సుమారు సంవత్సరం పైగానే అయింది. మధ్యలో పవన్ రాజకీయాలు వైపు వెళ్లడంతో కొన్నాళ్లు షూటింగ్ కూడా ఆగిపోయింది.
అయితే అన్ని సక్రమంగా జరిగి చిత్రం పూర్తయ్యి విడుదల తేదీని ప్రకటించే నాటికీ తీరా చిత్రాన్ని అడ్డుకుంటామని హెచ్చరికలు రావడంతో సినిమా ఆడితేనే అంతంత మాత్రం డబ్బులు వస్తుంటే..ఇప్పుడు అడ్డుకుంటామంటే నేను ఉరి వేసుకోవడమే. అని చిత్ర నిర్మాత శింగనమల రమేష్ మీడియాకెక్కనున్నాడట. చిత్రంలో నటించిన వారందరూ వారి వారి రెమ్యూనరేషన్ లు తీసుకుని సంతోషంగా ఉన్నారు. ఛిత్రం ఆగిపోయినా వారికి సంబంధం లేదు. ఒక్క నిర్మాతలే ఈ ఎఫెక్ట్ కు గురవుతారనేది గుర్తు పెట్టుకోవాలని ఆయన వేర్సాటు వాదులకు తెలియజేస్తున్నాడట. పవన్ పేరుకే గానీ ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ అన్ని నేనే. దయచేసి నా చిత్రాన్ని అడ్డుకోవద్దని ఆయన తెలంగాణ వాదులకు తెలుపుతున్నాడట.
ఇది మొదటి కోణం..ఇంత చెప్పినా చిత్రాన్ని అడ్డుకోవాలని చూస్తే 'మా" పరిణామాలు ఎలా ఉంటాయో కూడా త్వరలో చూపిస్తాం అని రెండవ కోణాన్ని బయటపెడుగున్నాడు..చిత్ర నిర్మాత. దీన్ని బట్టి చూస్తుంటే నిర్మాతల మండలి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ గా ఉందని అర్ధమవుతోంది.