Don't Miss!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- News వైసీపీలోకి జనసేన మఖ్య నేతలు - పిఠాపురం పై గురి..!!
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
అలిగిన క్రేజీ సింగర్.. ప్యాన్ ఇండియా డైరెక్టర్తో గొడవలే కారణమంటూ వైరల్
సిద్ శ్రీరామ్.. ఈ కాలంలో ప్రతీ ఒక్కరికీ తెలిసిన క్రేజీ సింగర్. పాడిన ప్రతీ పాట.. ఓ సెన్సేషనే. తన గాత్రంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ చెన్నై కుర్రోడు.. అతి తక్కువ కాలంలో వైరల్గా మారాడు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన అతని గురించె చెప్పుకున్నారు. తాజాగా ఈ యువ సంచలనానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్గా మారింది.
గీతగోవిందం, టాక్సీవాలాతో హల్చల్.
గీత గోవిందం సినిమాలోని ఇంకేం ఇంకేం కావాలే పాట పాడి.. ఎంతగా సంచలనం సృష్టించాడో అందరికీ తెలిసిందే. కేవలం ఆ ఒక్క పాటతోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. సిద్ శ్రీరామ్ గాత్రం ప్రత్యేకంగా నిలిచింది. ఈ పాటతో రెండు తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపిన సిద్ శ్రీరామ్ ఆపై టాక్సీవాలా చిత్రంలోని మాటే వినదుగా పాటతో మరోసారి క్రేజీగా మారాడు.
హుషారుతో యూత్ ఫాలోయింగ్..
హుషారు సినిమాలోని ఉండిపోరాదే పాట యూత్ను ఏ రకంగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఎవరి ఫోన్లో చూసినా అదే రింగ్టోన్ వినిపించేది. స్యాడ్ వెర్షన్ పాట కూడా అంతే ఫేమస్ అయింది. ఇలా వరుస పాటలతో తెలుగు నాట పాపులర్ సింగర్గా మారిపోయాడు.
తాజాగా సామజవరగమన అంటూ
ఒకే ఒక్క పాటతో సినిమాపై అంచనాలు పెంచేయడం మాములు విషయం కాదు. అల వైకుంఠపురములో చిత్రానికి తమన్ అందించిన సంగీతం పెద్ద అసెట్గా మారనున్నట్లు కనిపిస్తోంది. విడుదల చేసిన ప్రతీ పాట సంచలనంగా మారుతోంది. ఈ మూవీ నుంచి విడుదల చేసిన మొదటి సాంగ్ సామజవరగమన సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.
ప్రశంసలతో పాటు విమర్శలు
సామజవరగమన పాటతో ఎన్ని ప్రశంసలు అందుకున్నాడో.. అన్ని విమర్శలు అందుకున్నాడు. తన ఉచ్చారణతో పాట విలువను, తెలుగును కించపరుస్తున్నారని కొంతమంది టార్గెట్ చేశారు. అయినా ఇవేవీ పాటను ఆపలేకపోయాయి. అత్యధిక మంది ఇష్టపడిన పాటగా యూట్యూబ్లో రికార్డులు క్రియేట్ చేసింది.
Recommended Video
అలిగిన సింగర్..
మణిరత్నంతో ఏవో చర్చలు జరిగాయని, ఆ క్రమంలో సిద్ శ్రీరామ్ అలిగాడని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఆ ఫ్రస్ట్రేషన్లో అమెరికాకు చెక్కేశాడని, ఎవరు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడం లేదని టాక్. ఇదే పద్దతిని కొనసాగిస్తే.. అవకాశాలు తగ్గే ప్రమాదం కూడా ఉందని కొందరు అంటున్నారు. మరి వారిద్దరి మధ్య ఏం జరిగింది? నిజంగానే అంత పెద్ద గొడవ జరిగిందా? అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాలి.