twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రహ్మానందమే ఆ డబ్బు తిన్నారా?

    By Staff
    |

    Brahmanandam
    దాదాపు ఎనిమిదేళ్ళ క్రితం సీనియర్ నటుడు శివాజి రాజా స్వర్గీయ రేలంగి విగ్రహాన్ని ప్రతిష్టించాలని పోగుచేసిన డబ్బు తినేసారనే ఆరోపణలు వచ్చాయి.తాజాగా ఆయన ఓ ఇంటర్వూలో వాటిని ఖండించారు. ఈ విషయాలపై శివాజీ రాజా స్పందిస్తూ.. 8ఏళ్ళ క్రితం స్వర్గీయ రేలంగి విగ్రహాన్ని ప్రతిష్టించాలని, తనతో పాటు బ్రహ్మానందం, మల్లికార్జునరావు మరి కొంతమంది హాస్యనటీనటులు ట్రస్ట్‌గా ఏర్పడి చందాలు పోగుచేశామన్నారు.

    కానీ బ్రహ్మానందం తనకు పేరు రావడం లేదని తనపై విమర్శల దాడి చేశారని వాపోయారు. తన డబ్బంతా తానే స్వకార్యాలకు వినియోగిస్తున్న తరుణంలో.. రేలంగి విగ్రహం చందా డబ్బును తినేశానని వెల్లువెత్తిన ఆరోపణలు అసత్యమని శివాజీ రాజా నొక్కి చెప్పారు.అలాగే ఆ డబ్బంతా.. బ్రహ్మానందం దగ్గరే ఉన్నాయని, అప్పటికే నాలుగు లక్షలు పోగయ్యాయని శివాజీ రాజా వెల్లడించారు.

    కావలసినంత చందా పోగైనప్పటికీ రేలంగి విగ్రహ ప్రతిష్ట కార్యరూపం దాల్చలేదని, దీనికి బాధ్యుడు బ్రహ్మానందమేనని శివాజీ రాజా తెలిపారు. అప్పుడే తాను ప్రెస్‌మీట్ పెట్టి చెప్పానని అయినా ఫలితం లేదని అన్నారు. అంతేగాక తనను ముందుకు తోసిన తోటి హాస్య నటులు ఎవరూ ఆ ఫ్రెస్ మీట్ లో కనపడకపోవటం విశేషమని ఆవేదనగా అన్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా రేలంగి విగ్రహం సంగతి తేలిస్తే బాగుండును.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X