Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘డర్టీ పిక్చర్’ పై కోర్టు వెళ్లే యోచనలో స్మిత బంధువులు
అలనాటి సౌంతిండియా ఐటం గర్ల్ సిల్క్స్మిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న 'డర్టీపిక్చర్" ఇప్పటికే సంచనాలు, వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో కెక్కుతూ వస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా స్టిల్స్, టీజర్స్ జనాల్లో ఒక విధమైన చర్చకు దారి తీశాయి. తాజాగా ఈ సినిమాపై మరోసారి వివాదం చెలరేగింది. సిల్క్ స్మిత పాత్రధారి విద్యాబాలన్.. సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ మధ్య ఘాటైన లిప్ లాక్ సీన్లు చిత్రీకరించడమే తాజా వివాదానికి కారణం. స్మిత జీవితాన్ని మరీ డర్టీగా చూపిస్తున్నారంటూ ఆమె బంధువులు దర్శకనిర్మాతలను కోర్టుకీడ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఐటం గాళ్గా స్మిత జీవితంలోని ముఖ్య ఘట్టాలు, జీవన శైలి, ట్రాజెడీ, ఆత్మ హత్యతో ఆమె జీవితం ముగిసిన తీరు..ఇలా ఆమె జీవితంలోని ముఖ్య సంఘటనలను ప్రస్తావిస్తూ దర్శకుడు మిలన్ లుద్రియా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని డిసెంబర్ 2న విడుదల చేయడానికి నిర్మాతలు ఏక్తాకపూర్, శోభాకపూర్ సన్నాహాలు చేస్తున్నారు.