Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు అంటూ....!
హైదరాబాద్: శ్రీదేవి కూతురు జాహ్నవి సినీ రంగ ప్రవేశం గురించి గత రెండు మూడేల్లుగా రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు మాత్రం ఆమె ఎంట్రీ ఖరారు కాలేదు. పలానా హీరో సినిమా ద్వారా జాహ్నవి హీరోయిన్ గా పరిచయం అవుతుందని మీడియాలో రావడం, శ్రీదేవి ఆ వార్తలను ఖండించడం సర్వసాదారణం అయిపోయింది.
ఇదే క్రమంలో తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తోంది. ఎన్టీఆర్-కొరటాల శివ సినిమాలో శ్రీదేవి కూతురు జాహ్నవిని హీరోయిన్ గా పరిచయం చేయాలనే ప్రయత్నాలు సాగుతున్నాయనట. మరి ఈ సారైనా జాహ్నవి హీరోయిన్ గా పరిచయం అవుతుందా? లేక ఇది కూడా రూమర్ల లిస్టులో చేరిపోతుందా? అనేది తేలాల్సి ఉంది.
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవం ఇటీవలే జరిగింది. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించబోతోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం అక్టోబర్ హైదరాబాద్ లో మైత్రీ మూవీస్ కార్యాలయం లో చిత్ర బృందం నడుమ జరిగింది.
ఈ చిత్రానికి క్లాప్ ను ఎన్టీఆర్ కొట్టగా, ఆయన తనయుడు అభయ్ రామ్ తో కెమెరా స్విచ్ ఆన్ చేయించారు. కొరటాల శివ తో నాకు బృందావనం రోజుల నుండి అనుబంధం ఉంది. అయన ఒక అధ్బుతమైన రచయిత. ఒక అభిరుచి గల డైరెక్టర్. క్లాస్, మాస్ అంశాలను ఆయన బాలన్స్ చేసుకునే విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. కొరటాల శివ అందించిన ఈ కథ నాకు బాగా నచ్చింది. మైత్రీ మూవీస్ సంస్థ తో పని చేయటం ఆనందం గా ఉంది అన్నారు.