twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల నెక్ట్స్ ఏంటి?

    By Srikanya
    |

    Srikanth Addala
    హైదరాబాద్ : కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు చిత్రాల ద్వారా తానేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆయన తన తదుపరి చిత్రంగా నాగబాబు కుమారుడు వరుణ్ తేజ ని లాంచ్ చేస్తూ గొల్లభామ చిత్రం రూపొందిస్తారని అంతా భావించారు. అయితే అనుకోని పరిస్ధితుల్లో అది కాన్సిల్ అయ్యి ..పూరీ చేతుల్లోకి వెళ్లింది.

    దాంతో ఇప్పుడు అడ్డాల శ్రీకాంత్ అంతా కొత్త వాళ్లతో ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దానికి అతనే నిర్మాతగా వ్యవహిస్తాడని,అందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని టాలీవుడ్ సర్కిల్స్ లో వినపడుతోంది. కొత్త బంగారు లోకం మరో లవ్ స్టోరీ బిగ్ హిట్ ఇచ్చి...బిగ్ హీరోలతోనే కాదు...కొత్త వాళ్లతో కూడా హిట్ కొట్టగలనని అనిపించుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.

    అయితే మరో ప్రక్క పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నాడని, ఈ లోగా ఈ చిత్రం ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నాడని చెప్తున్నారు. తాను అనుకున్న క్రియేటివిటి మొత్తం చిన్న చిత్రంలో అయితే పూర్తిగా ఆవిష్కరించే వీలుంటుందని శ్రీకాంత్ ఆలోచనగా చెప్తున్నారు.

    English summary
    Srikanth Addala wants to prove his mettle with newcomers. So the director is now looking for newcomers for lead roles. Also buzz is that he himself may produce the film .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X