Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘శ్రీమంతుడు’ : డిస్ట్రిబ్యూటర్స్ తో నిర్మాతలు సీక్రెట్ గా... ?
హైదరాబాద్: మహేష్బాబు హీరోగా నటిస్తున్న చిత్రం'శ్రీమంతుడు'. శ్రుతి హాసన్ హీరోయిన్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సీవీఎమ్) నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై ఎక్సపెక్టేషన్స్ రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం...బిజినెస్ కదలటం లేదని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటిని నమ్మేలా మరో వార్త బయిటకు వచ్చింది..అది మరేదో కాదు...నిర్మాతలు...ఈ చిత్రం డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వారితో రహస్య మీటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్న దాన్ని బట్టి...నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కు మధ్య చాలా కాన్ఫిడెన్సిషల్ మీటింగ్ జరిగిందని చెప్పుకుంటున్నారు. డిస్ట్రిబ్యూటర్స్...రిలీజ్ డేట్ లో ఏదన్నా మార్పు ఉంటుందేమో అడిగారని,ఎందుకంటే బాహుబలి ..జూలై 10న వస్తూండటంతో అలా అడగాల్సి వచ్చిందని చెప్పుకుంటున్నారు. అయితే నిర్మాతలు...మొదట ప్రకటించిన తేదీనే ఫైనల్ చేసారని, అదే ఫైనల్ అని చెప్పారని అంటున్నారు. జూలై 17న శ్రీమంతుడు రిలీజ్ చేస్తున్నట్లే..
చిత్రం లేటెస్ట్ ఇన్ఫో...
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. శ్రీ మంతుడుకి సంబందించిన చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర టీం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా జెట్ స్పీడ్ లో ఫినిష్ చేస్తున్నారు. ఇప్పటికే ఎడిటింగ్ మరియు డబ్బింగ్ పనులు చివరి దశకు చేరుకుంటున్నాయి.
ఈ సినిమాలోని నటీ నటుల డబ్బింగ్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. వారిది ముగియగానే మహేష్ బాబు తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ ని పూర్తి చేస్తారు. అనుకున్న రిలీజ్ డేట్ జూలై 17 కల్లా సినిమాని రిలీజ్ చెయ్యాలని ఈ చిత్ర టీం కంటిన్యూగా వర్క్ చేస్తూ సినిమా కార్యక్రమాలను ఫినిష్ చేస్తున్నారు.
మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించనుంది. జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనమ్ శెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు. మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాని ఆడియో రిలీజ్ వేడుకని జూన్ చివర్లో చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
మరో ప్రక్క రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న ఈ నేపధ్యంలో...బిజినెస్ ఇంకా పూర్తి కాలేదని సమాచారం. నైజాం తప్పించి ముఖ్యంగా వెస్ట్ , ఓవర్ సీస్ బిజినెస్ అసలు కదలటం లేదని ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.అయితే ఇది ఎంతవరకూ నిజమో తెలియాల్సి ఉంది.
దానికి కారణం...మహేష్ గత చిత్రాలు...ఆగడు, 1 నేనొక్కడినే చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావటంమే అంటున్నారు. దాంతో తక్కువ రేట్లుకు బయ్యర్లు అడగటం జరుగుతోంది. అయితే నిర్మాతలు మాత్రం తగ్గించటానికి ససేమిరా ఒప్పుకోవటం లేదు. ఈ నేపధ్యంలో బిజినెస్ ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. రేట్లు తగ్గిస్తే బిజినెస్ అవుతుందని అంటున్నారు.
ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ని,టీజర్ ని ఇప్పటికే విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో సైకిల్పై స్త్టెలిష్గా కనిపిస్తున్న మహేష్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తికావోచ్చిన ఈ చిత్రం ఆడియో ని ఈ నెల 27న హైదరాబాద్ లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరో ప్రక్క ఈ చిత్రంలో మహేష్ వాడే సైకిల్ ఖరీదు ఎంత ఉండవచ్చు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమచారం ప్రకారం ఈ సైకిల్ ఖరీదు... మూడున్నర లక్షలు అని తెలుస్తోంది. ఈ సైకిల్... Canondale కంపెనీవారి Scalpel 29 మోడల్ లో త్రీ ఫ్రేమ్ కార్బన్ అని తెలుస్తోంది. ఇది విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. ఈ సైకిల్ ఖరీదు... అక్కడ 5500$ అంటున్నారు. మహేష్ ఓ మిలియనీర్ అని ఈ సైకిల్ తో దర్శకుడు చెప్పాడంటున్నారు.
ఇక ఈ చిత్రంతో మహేష్బాబు నిర్మాతగా మారారు. జి.మహేష్బాబు ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. 'శ్రీమంతుడు' సినిమాతోనే మహేష్ చిత్ర నిర్మాణంలోకి అడుగు పెట్టారు. 'శ్రీమంతుడు' పోస్టర్లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థతో పాటు, మహేష్బాబు నిర్మాణ సంస్థ లోగో కూడా ముద్రించారు.
'శ్రీమంతుడు' చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి... ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ ఇంతకు ముందు ప్రభాస్ కు 'మిర్చి'తో అదిరిపోయే విజయాన్ని అందించాడు... ఆ దిశగా ఆలోచిస్తే- మహేశ్ బాబుకు అంతకంటే మిన్నయైన విజయాన్ని కొరటాల శివ అందిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
మైత్రీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న 'శ్రీమంతుడు' చిత్రం సకుటుంబ సపరివార సమేతంగా చూడతగ్గ చిత్రమని యూనిట్ సభ్యులు చెబుతున్నారు... దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.
మహేష్బాబు అప్కమింగ్ మూవీ శ్రీమంతుడు టీజర్ ను ఆదివారం రిలీజ్ చేశారు. హీరో కృష్ణ బర్త్డే సందర్భంగా ఈ టీజర్ను రిలీజ్ చేశారు. శ్రీమంతుడు మూవీపై మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్ ను శుక్రవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై మిత్రులు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్లు సమష్టిగా 'మిర్చి' ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. 'ఆగడు' తర్వాత చాలాకాలంగా తెరపై కనిపించని మహేశ్ ఫస్ట్లుక్కు సహజంగానే అభిమానుల నుంచి విశేషస్పందన లభించింది. ఇప్పుడు టీజర్ ను కూడా రిలీజ్ చేయడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది.