Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఎన్టీఆర్, చరణ్ కోసం కిర్రాక్ స్టోరీ.. రాజమౌళి మల్టీస్టారర్ బడ్జెట్ తెలిస్తే షాకే..
Recommended Video
దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రాంచరణ్ కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ముగ్గురి కాంబినేషన్లో మల్టీస్టారర్ చిత్రం రాబోతున్నదనే వార్త టాలీవుడ్నే కాదు.. ఇతర సినీ పరిశ్రమలను కూడా కుదిపేసింది. తాజాగా ఈ వీరి కాంబినేషన్లో రాబోతున్న చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేమింటంటే..
ముగ్గురు స్వలింగ సంపర్కులు.. రాజమౌళి ఫొటోపై వర్మ నీచమైన కామెంట్.. కూతుర్నిపంపించు అంటూ..
విజయేంద్ర ప్రసాద్ కసరత్తు
ఎన్టీఆర్, రాంచరణ్తో రాజమౌళి తీయబోయే చిత్రానికి సంబంధించిన కథపై ఇప్పటికే కథా రచయిత, జక్కన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కసరత్తు చేస్తున్నారనేది తాజా సమాచారం.
యాక్షన్ ఎమోషనల్ స్టోరీతో
విజయేంద్ర ప్రసాద్ రూపొందించనున్న కథ చాలా పవర్పుల్గా ఉంటుంది అని సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎమోషనల్ సీన్స్ను, యాక్షన్ కథతో రూపొందించబోయే చిత్రంలో భారీ తారాగణం ఉంటుందట.
ఫ్యాన్స్ ఫాలోయింగ్ను
ఎన్టీఆర్, రాంచరణ్ ఇమేజ్, అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఎవరి పాత్రకు ఏ మాత్రం ప్రధాన్యం తగ్గకుండా కథాపరంగా చర్యలు తీసుకొంటున్నారట.
150 కోట్ల బడ్జెట్తో
ఇక ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.150 కోట్లకుపైగానే అనే మాట వినిపిస్తున్నది. బాహుబలి తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న చిత్ర కావడంతో భారీ అంచనాలు నెలకొనే అవకాశం ఉంది. ఫ్యాన్స్, ప్రేక్షకుల అంచనాలకు తగ్గినట్టే సినిమాను తెరకెక్కించే ఉద్దేశంతో జక్కన్న ప్రిపేర్ అవుతున్నాడట.
బోయపాటితో రాంచరణ్
ఈ ప్రాజెక్ట్కు ముందు రాంచరణ్, ఎన్టీఆర్కు వేరే దర్శకులతో కమిట్మెంట్ ఉంది. బోయపాటి శ్రీనుతో రాంచరణ్ ఓ మాస్ సినిమా చేయనున్నాడు.
త్రివిక్రమ్తో రాంచరణ్
అలాగే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఎన్టీఆర్ యాక్షన్తో కూడిన ఓ కుటుంబ కథా చిత్రంలో నటించనున్నారు. ఇప్పటికే వారి చిత్రం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరిలో గానీ, మార్చి నెలలో గానీ సెట్స్ పైకి వెళ్తుంది.
2019లో విడుదల
రాంచరణ్, ఎన్టీఆర్ చిత్రాలు 2018 వేసవిలో పూర్తయ్యే అవకాశం ఉంది. వారి చిత్రాలు పూర్తయిన తర్వాత రాజమౌళి మల్టీస్టారర్ చిత్రం సెట్స్ పైకి వెళ్తుందట. ఈ చిత్రాన్ని 2019లో విడుదల చేసే విధంగా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.