Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బాలయ్య మూవీ కోసం స్టార్ హీరో కూతురికి భారీ ఆఫర్.. అయినా ఒప్పుకోలేదా?
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలు రెగ్యులర్ హీరోయిన్స్ తో నటించడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అభిమానులు కూడా కాంబినేషన్ లు కూడా సరికొత్తగా ఉండాలని అనుకుంటున్నారు. ఒకప్పుడు హీరో హీరోయిన్ కాంబినేషన్ అంటే అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయేవి. కానీ ఇప్పుడు అన్ని సార్లు కూడా కాంబోలు అంతగా వర్కవుట్ అవ్వడంలేదు. ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి కాబట్టి అభిమానులు ఆలోచనలకు తగ్గట్టుగా సరికొత్తగా కనిపించేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఒక విధంగా హీరోయిన్స్ కు ఇది ఒక పెద్ద మైనస్ అని చెప్పవచ్చు. ఎక్కువ కాలం ఉండాలని ఆలోచించే హీరోయిన్స్ కెరీర్ పై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.
అయితే నందమూరి బాలకృష్ణ కోసం దర్శకుడు గోపీచంద్ మలినేని ఇటీవల ఒక స్టార్ హీరో కూతురిని సంప్రదించగా ఆమె రిజెక్ట్ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఆమెకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినప్పటికీ కూడా ఒప్పుకోలేదు అని తెలుస్తోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత అతనికి ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. కానీ బాలకృష్ణ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో త్వరలోనే ఓ భారీ యాక్షన్ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. అయితే హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం అయితే బాలకృష్ణకు సెట్ అయ్యే విధంగా హీరోయిన్స్ దొరకడం చాలా కష్టంగా మారిందని రూమర్స్ వస్తున్నాయి. అఖండ సినిమా కోసమే ఎంతో మంది హీరోయిన్స్ అనుకొని చివరికి కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ను ఫిక్స్ చేయక తప్పలేదని టాక్ వచ్చింది. ఆ తరువాత గోపీచంద్ మలినేని సినిమాతో బిజీ గా మారనున్న బాలయ్య వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. అయితే ఇటీవల గోపీచంద్ మలినేని దాదాపు ఈ సినిమాకు సంబంధించిన నటీనటులందరిని కూడా ఫైనల్ చేసేసాడు. అయితే హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు.
ఇటీవల కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ను కూడా సంప్రదించారని టాక్ అయితే వచ్చింది. అయితే ఆమె మాత్రం సినిమా చేసేందుకు వెనుకడుగు వేసినట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. గతంలో శృతిహాసన్ డైరెక్టర్ గోపీచంద్ తో రెండు సినిమాలు చేసింది. అది కూడా రవితేజ కాంబినేషన్ లోనే రావడం విశేషం. బలుపు క్రాక్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. రవితేజ శృతి హాసన్ కాంబినేషన్ తో పాటు గోపీచంద్ మలినేని కూడా మంచి గుర్తింపు లభించింది. ఒకసారి మళ్లీ అదే హీరోయిన్ తో సినిమా చేయాలని గోపీచంద్ ఫిక్స్ అయ్యాడు. ఆమెకు ఇటీవల 2.5 కోట్ల రెమ్యునరేషన్ ను కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం ఖర్చు చేయడంలో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇక శృతి ఈ కాంబినేషన్లో సినిమా ఎందుకు చేయనని చెప్పిందో తెలియదు గాని ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఫైనల్ గా బాలయ్య కోసం ఎలాంటి బ్యూటీని ఫిక్స్ చేస్తారో చూడాలి.