Don't Miss!
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
నాగ్ 'గ్రీకు వీరుడు' కథ ఇదా?
హైదరాబాద్ : నాగార్జున, నయనతార జంటగా నటించిన చిత్రం 'గ్రీకు వీరుడు'. దశరథ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని మే 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెర మీదకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దశరథ్, నాగ్ కాంబినేషన్ రిపీట్ కావటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ నేఫధ్యంలో చిత్రం కథపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.
చందు (నాగార్జున) అమెరికాలో ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను నిర్వహిస్తుంటాడు . ప్రేమ,పెళ్లి వంటి విషయాలపై నమ్మకాల్లేని వ్యక్తి. ప్రతి విషయంలోనూ వ్యాపారాత్మకంగా ఆలోచించడం అతని నైజం. తొందరగా బంధాలను తెంచేసుకుంటాడు. అతను చేసే బిజినెస్ లో ఓ సమస్య రావటంతో డబ్బుకోసం ఇండియాకు తొలిసారి వస్తాడు.
ఇండియాలో అడుగుపెట్టగానే ఎయిర్ పోర్ట్ లోనే...సంధ్య(నయనతార)పరిచయమవుతుంది. ఆమె ఎ మేక్ ఏ విష్ ఫౌండేషన్ లో డాక్టర్ గా పనిచేస్తూంటుంది. ఆమెకు ప్రేమ,బంధంవీటిపై నమ్మకాలు ఎక్కువ. జీవింతంలో ప్రేమే నిజమైనది అని నమ్ముతుంది. వీరిద్దరి మధ్య సరదాగా మొదలైన ప్రయాణం..ఓ బంధంతో ముగుస్తుంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం అంహంభావం ఉన్న డాక్టర్ గా కనిపిస్తారు. మీరా చోప్రా పాత్ర బబ్లిగా సాగుతుంది.
బంధాలను తెంచుకోకూడదు..పెంచుకోవాలి అనే పాయింట్ తో రూపొందిన ఈ చిత్రంలో సెకండాఫ్ లో ముగ్గురు చిన్న పిల్లల మధ్య కథ,కథనం నడుస్తుంది. దశరథ్ సంతోషం నాటి మ్యాజిక్ ని రిపీట్ చేసాడంటున్నారు. నాగ్ కూడా ఈచిత్రంలో కొత్తగా చాలా ఎనర్జిటిక్ గా కనిపించి అలరిస్తున్నాడు.
మీరాచోప్రా, కె.విశ్వనాథ్, కోట శ్రీనివాసరావు, శరత్బాబు, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రఘుబాబు, వేణుమాధవ్, వెన్నెల కిషోర్, కాశీ విశ్వనాథ్, నాగినీడు, గీతాంజలి, సుధ, జయలక్ష్మి, జయవాణి, లహరి, ఇందు తదితరులు ఇతర పాత్రధారులు.
ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, సంగీతం: థమన్, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కో-డైరెక్టర్: కె. సదాశివరావు, స్క్రీన్ ప్లే: హరి కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఎం.ఎస్.ఆర్: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్, కో ప్రొడ్యూసర్: డి. విశ్వచందన్ రెడ్డి, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ-దర్శకత్వం: దశరథ్.