దశావతారం కథేంటంటే...

దాంతో రాజద్రోహం కింద నంబికి మరణ దండన విధిస్తాడు చోళుడు. తనను ఉరి తీసే సమయంలోనూ నంబి విష్ణు విగ్రహాన్ని వదలడు. ఆ విగ్రహంతో పాటు నంబి మృతదేహాన్ని సముద్రంలో పారేయిస్తాడు చోళుడు. ఆ తర్వాత కథ నేటి కాలంలోకి మారుతుంది. ఈ ఆధునిక కాలంలో కమలహాసన్ 9 పాత్రల్లో కనిపిస్తాడు. ఆ పాత్రలన్నింటికీ కథతో సంబంధం వుంటుంది.
అలాగే ఈ పాయింటు బ్రియాన్ వీజ్ అనే ఆంగ్ల రచయిత వ్రాసిన 'మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్' ,'సేమ్ సోల్ మెనీ బాడీస్' అనే పుస్తకాల సారాంసమేనంటున్నారు. హిందూ కర్మ సిద్దాంతాన్ని బలపరిచే ఈ పుస్తకాలలోని విషయం ప్రకారం మనిషి రకరకాల జన్మల్లో జన్మిస్తూ...కావల్సిన నాలెడ్జ్ ని తెలుసుకుంటూ ఎదుగుతూ,కొత్త కొత్త విషయాలు తెల్సుకుంటూ..చివరకు పరమాత్మలో లీనమవుతాడు. ఆయన రెగ్రెషన్ థెరిపీ ఆధారంగా వ్రాసిన అంశాల ప్రకారమే కథనం నడుస్తుందంటున్నారు. అంటే జానికిరాముడు, ఓం శాంతి ఓం లాంటి సబ్జెక్టు అన్నమాట. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.
ఇక ఈ సినిమాలో కమల్ రంగరాజ నంబి పాత్రతో పాటు గోవింద రామస్వామి, జార్జి బుష్, అవతార్ సింగ్, క్రిస్టియన్ ఫ్లెచర్, షింఘేన్ నరహసి, కృష్ణవేణి, విన్సెంట్ పూవరాగన్, కలీఫుల్లా ఖాన్, బలరాంనాయుడు పాత్రల్ని కమల్ పోషించాడు. రెండవ కుళోత్తుంగ చోళునిగా నెపోలియన్ నటించగా, ఇతర పాత్రల్ని నగేష్, పి. వాసు, సంతాన భారతి, రేఖ, రఘురాం, కె.ఆర్. విజయ చేశారు. కమల్ సరసన నాయికగా అసిన్ ద్విపాత్రలు పోషించగా, బాలీవుడ్ శృంగార తార మల్లికా షెరావత్, నిన్నటి తరం అందాల తార జయప్రద కూడా కమల్ సరసన కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











