Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ బావ తెలివైనోడే...పట్టేస్తున్నాడు
హైదరాబాద్ : మహేష్ బాబు బావ సుధీర్ బాబు కెరీర్..ఆడు మగాడ్రా బుజ్జీ తర్వాత అర్దాంతరంగా ఆగినట్లైంది. ఆయన చేతిలో ఉన్న మాయదారి మల్లి గాడు చిత్రం సైతం ఆర్దిక ఇబ్బందులతో బ్రేక్ పడింది. ఈ నేపధ్యంలో సేఫ్ గేమ్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కన్నడ చిత్రం ఛార్మినార్ రీమేక్ ఓకే చేసారు. అలాగే ఇప్పుడు స్వామి రారా చిత్రం సీక్వెల్ కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇంతకుముందు దర్శక,నిర్మాతలను తన క్రియేటివిటీతో ఇబ్బంది పెట్టిన సుధీర్ బాబు సైలెంట్ గా తన పని తాను చేసుకుని పోతున్నాడంటున్నారు. అందుకే ఆయన్ను ఆఫర్స్ వెతుక్కుంటూ వెళ్తున్నాయని, అలాగే ఎక్కువ డిమాండ్స్ పెట్టకుండా మొదట తన కెరీర్ నిలబడితే చాలు అన్నట్లు రెమ్యునేషన్ విషయంలోనూ పట్టు,విడుపుతో వ్యవరిస్తున్నాడని అంటున్నారు.
నిఖిల్, స్వాతి జంటగా సుధీర్వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన స్వామిరారా సీక్వెల్ ని సిద్దం చేసుకుని, రంగం లోకి దూకుతున్నాడు ఎన్.బోస్ అనే నూతన దర్శకుడు. ఎన్.బోస్... స్వామి రారా దర్శకుడు వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన అనుభవంతో ఈ చిత్రం రూపొందించటానికి సిద్దపడుతున్నారు. స్వామి స్వామి రారా అనే టైటిల్తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ది సాగా కంటిన్యూస్ అనేది ఉపశీర్షిక. ఎన్.బోస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని స్వామిరారా చిత్రాన్ని నిర్మించిన చక్రి చిగురుపాటి లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించబోతున్నాడు. ఈ చిత్రంలో హీరోగా సుధీర్ బాబు ని ఎంపిక చేసారని సమాచారం.
ఎన్.బోస్... స్వామి రారా దర్శకుడు వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన అనుభవంతో ఈ చిత్రం రూపొందించటానికి సిద్దపడుతున్నారు. స్వామి స్వామి రారా అనే టైటిల్తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ది సాగా కంటిన్యూస్ అనేది ఉపశీర్షిక. ఎన్.బోస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని స్వామిరారా చిత్రాన్ని నిర్మించిన చక్రి చిగురుపాటి లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించబోతున్నాడు.
నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ... నవ్యతతో కూడిన కథాంశంతో సినిమాలు రూపొందిస్తే ఆ చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ తప్పక వుంటుందని స్వామిరారా చిత్రం మరోసారి నిరూపించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ను నిర్మించబోతున్నాం. ఓ స్టార్ హీరో నటించనున్న ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా, హై బడ్జెట్తో, హై టెక్నికల్ వాల్యూస్తో తెరకెక్కించనున్నాం. త్వరలోనే సెట్స్మీదకు వెళ్ళనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత బీఎస్ వర్మ.
ఇక ఈ సినిమాలో మొదట నిఖిల్ హీరోగా చేస్తారనుకున్నారు. అయితే నిఖిల్...స్క్రిప్టు తో తృప్తి చెందలేదని ట్వీట్ చేసారు అప్పట్లో. ఆ ట్వీట్ లో ఏముందీ అంటే.... ' స్వామి రారా చిత్రం సీక్వెల్ మ్యాటర్ ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే ఉంది. నేను కూడా ఈ చిత్రం ప్రొడక్షన్ టీంలో ఒక్కడిని. ఈ సినిమా మొదలవ్వచ్చు లేదా మొదలు కాకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఒక ఐడియా మీద మాత్రం వర్క్ చేస్తున్నాం. స్వామి రారా కంటే స్క్రిప్ట్ బాగా వస్తేనే స్వామి రారా సీక్వెల్ సెట్స్ పైకి వెళుతుంది' నిఖిల్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.