Don't Miss!
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- News పోటీ నుంచి తప్పుకున్న శ్రీరాములు భార్య, రంగంలోకి గాలి జనార్దన్ రెడ్డి, వార్ వన్ సైడ్ కాదు, పోటీ !
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
'పుష్ప' కోసం గట్టిగానే వాడుతున్నారు.. 3నిమిషాల కోసం మరో 3కోట్లు?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో తెలియదు గాని సినిమాకు సంబంధించిన విశేషాల గురించి వింటుంటే ఇప్పుడే రికార్డుల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా ఉంది. పాన్ ఇండియా సినిమా కావడంతో మునుపెన్నడు లేని విధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శక్తినంతా ధార పోస్తున్నాడట. ఇక సుకుమార్ కూడా బడ్జెట్ విషయంలో లెక్కలేమి పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
ఆరు నిమిషాల యాక్షన్ సీన్ కోసం ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఇటీవల ఒక న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక స్పెషల్ సాంగ్ కోసం మరొక మూడు కోట్లు ఖర్చు చేయనున్నారట. దేవి శ్రీ ప్రసాద్ సరికొత్త మ్యూజిక్ తో ట్యూన్స్ సెట్ చేస్తుండగా సుకుమార్ భారీ సెట్స్ తో మరీంత హైప్ క్రియేట్ చేయనున్నాడట. అడవుల్లో సాగే మూడు నిమిషాల పాట కోసం అల్లు అర్జున్ స్పెషల్ స్టంట్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.
విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఆడియెన్స్ కి సరికొత్త థ్రిల్ ఇవ్వనున్నాయట. మొత్తంగా సుకుమార్ రూరల్ డ్రామాతోనే తన అసలైన టాలెంట్ ని ఇండియాకు పరిచయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతగా హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ అనంతరం ఎంతవరకు కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే.