Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఉప్పెనతో లాభాలు.. మరో మెగా హీరోపై ఇన్వెస్ట్ చేస్తున్న సుకుమార్
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉప్పెన సినిమా చాలా రోజుల తరువాత ఒక సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ అయితే మొత్తానికి పర్ఫెక్ట్ డెబ్యూతో మెగా ఫ్యాన్స్ కు మంచి కిక్కిచ్చాడు. దాదాపు 70కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇక సినిమాను డైరెక్ట్ చేసింది బుచ్చిబాబు అయినప్పటికీ అతని గురువుకే భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.
ఇక వచ్చిన లాభాల్లో సుకుమార్ కు కూడా వాటా గట్టిగానే వచ్చిందట. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ తో పాటు సుకుమార్ కూడా సినిమాపై కొంత ఇన్వెస్ట్ చేశాడు. సినిమా సెట్స్ పైకి రావడానికి ముఖ్య కారణం కూడా సుకుమార్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఉప్పెన వచ్చిన ప్రాఫిట్స్ ను మరో మెగా హీరో సినిమాపై కూడా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు టాక్ వస్తోంది. ఆ హీరో మరెవరో కాదు. వైష్ణవ్ తేజ్ అన్నయ్య సాయి ధరమ్ తేజ్.
సాయి ధరమ్ తేజ్ కూడా సుకుమార్ రైటింగ్స్ లో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాను సుకుమార్ తో పాటు BVSN ప్రసాద్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ సినిమాపై కూడా సుకుమార్ చాలా నమ్మకంతో ఉన్నారట. అందుకే బడ్జెట్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా భారిగానే ఖర్చు పెడుతున్నారట. మరి ఆ సినిమాతో సుకుమార్ ఎంతవరకు లాభాలు అందుకుంటాడో చూడాలి.