Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సుకుమార్తో సినిమా.. మూడింటిలో ఒకదానికి ఫిక్స్ అయిన మహేష్!
Recommended Video
సూపర్ స్టార్ మహేష్ బాబు సీఎం భరత్ గా అందరిని మాయ చేసాడు. ఆ మాయనుంచి మహేష్ ఫాన్స్ బయటకు రావాలంటే ఈ సూపర్ స్టార్ మరో సినిమా మొదలు పెట్టాల్సిందే. భరత్ అనే నేను చిత్రం తరువాత వంశి పైడిపల్లి దర్శకత్వంలో నటించాలని మహేష్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అశ్విని దత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ నుంచి ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉండగానే సుకుమార్ తో సినిమాకు కూడా మహేష్ ఒకే చెప్పేశాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ మహేష్ తో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో సుకుమార్ ఉన్నాడు. అందుకోసమే మూడు కథలని మహేష్ కు ఇటీవల వినిపించాడట సుక్కు. వాటిలో ఒకదానిని ఫైనల్ చేసి పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయాలని సుక్కుని ఆదేశించాడట.
ఆ కథ కూడా రంగస్థలం చిత్రానికి వలే వైవిధ్యంతో కూడుకున్నదని తెలుస్తోంది. 1 నేనొక్కడనే లాగా నిరాశపరచకుండా పక్కాగా స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఈ దర్శకుడు బిజీగా ఉన్నాడు. రంగస్థలం చిత్రంతో తాను స్క్రీన్ ప్లే నడిపించడంలో సుకుమార్ తన ప్రత్యేకత చాటుకున్న సంగతి తెలిసిందే.