twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మైత్రి నిర్మాతల వద్ద సుకుమార్ డిమాండ్.. పైకంపై పంథా మార్చేస్తూ! బన్నీ సినిమాకు భలే స్కెచ్..

    |

    Recommended Video

    #AA20 Movie LAunch | Allu Arjun - Sukumar Movie Launch Event

    క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన కొత్త సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రంగస్థలం సినిమా సక్సెస్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఆయన, అల్లు అర్జున్‌తో తన తాజా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఎంత క్రియేటివ్‌గా స్క్రిప్ట్ రాశాడో.. అంతే క్రియేటివ్‌గా పైకం గురించి ఆలోచిస్తున్నాడట సుకుమార్. ఈ మేరకు తన డిమాండ్‌ని మైత్రి నిర్మాతల వద్ద పెట్టేశారని తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..

     అల్లు అర్జున్- సుకుమార్.. ముహూర్తం కుదిరింది

    అల్లు అర్జున్- సుకుమార్.. ముహూర్తం కుదిరింది

    ఓ వైపు 'అల.. వైకుంఠపురములో' షూటింగ్‌లో పాల్గొంటూనే.. తన తదుపరి సినిమాకు ముహూర్తం పెట్టేశారు అల్లు అర్జున్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు కమిట్ అయ్యారు. అక్టోబర్ 30వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని లాంఛనంగా ప్రారంభమైంది.

    పైకంపై పంథా మార్చేస్తూ

    పైకంపై పంథా మార్చేస్తూ

    ఈ మధ్యకాలంలో దర్శకులు పైకంపై పంథా మార్చేస్తున్నారు. ఇదివరకటిలా డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించినందుకు గాను రెమ్మూనరేషన్ తీసుకోకుండా సినిమా బిజినెస్‌లో భాగమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సుకుమార్ కూడా ఓ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అల్లు అర్జున్‌తో తాను రూపొందించనున్న సినిమాకు రెమ్మూనరేషన్ నిరాకరించారట సుకుమార్.

    నిర్మాతల వద్ద సుకుమార్ డిమాండ్

    నిర్మాతల వద్ద సుకుమార్ డిమాండ్

    ఈ మేరకు మైత్రి నిర్మాతల ముందు సుకుమార్ ఓ డిమాండ్ పెట్టారని తెలిసింది. విడుదలకు ముందు, విడుదల తర్వాత సినిమా చేసే బిజినెస్‌లో షేర్ కావాలని కోరారట సుక్కు. ఈ మేరకు తనకు రెమ్మూనరేషన్ అవసరం లేదని తెగేసి చెప్పారట. ఈ విషయమై చర్చలు జరిపిన మైత్రి నిర్మాతలు చివరకు ఓకే చెప్పేశారని సమాచారం.

    నెల ఖర్చులు.. అచ్చం సాలరీ లాగే

    నెల ఖర్చులు.. అచ్చం సాలరీ లాగే

    మైత్రి నిర్మాతలు, సుకుమార్ మధ్య జరిగిన చర్చల్లో ఓ ఒప్పందం కుదిరిందని టాక్ నడుస్తోంది. సినిమా పూర్తయ్యేవరకు నెల నెలా ఖర్చుల నిమిత్తం మైత్రి నిర్మాతల నుంచి కొంత సొమ్ము తీసుకుంటారట సుక్కు. మంత్లీ సాలరీ లాగే ఈ అమౌంట్ సుకుమార్‌కి అందనుందని తెలుస్తోంది. ఇదిగాక సినిమా అంతా పూర్తయ్యాక ఆ సినిమా చేసే బిజినెస్‌లో షేర్ తీసుకుంటారట సుకుమార్.

     వచ్చే ఏడాది.. గంధపు చెక్కల స్మగ్లింగ్

    వచ్చే ఏడాది.. గంధపు చెక్కల స్మగ్లింగ్

    గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రెడీ చేసిన స్క్రిప్ట్‌తో రంగంలోకి దిగుతున్నారట సుకుమార్. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనుంది. అతిత్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

    English summary
    Allu Arjun And Sukumar Movie Opening On 30th October. This Movie Is Produced Inder Mythri Movies. Rashmika Mandanna Is Feamle Lead.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X