Don't Miss!
- News ఊపిరి పీల్చుకున్న ఉద్యాననగరి..!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
'పుష్ప' కోసం బాలీవుడ్ బ్యూటీలపై కన్నేసిన బన్నీ గ్యాంగ్?
తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరు పాన్ ఇండియా ఆకలిని తీర్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఎలాగైనా బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని బడ్జెట్ గురించి పట్టించుకోకుండా కష్టపడుతున్నారు. కాన్సెప్ట్ బావుంటే భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా చూస్తారని సౌత్ టెక్నీషియన్స్ కి ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాతో రెడీ అవుతున్న వారిలో అల్లు అర్జున్ ఒకరు.
సుకుమార్ దర్శకత్వంలో బన్నీ 'పుష్ప' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ చెప్పిన చిత్ర యూనిట్ ప్రస్తుతం కొత్త షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకుంటోంది. అయితే సినిమాకు సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలపై దర్శకుడు ఇటీవల బన్నీతో చర్చించినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా సినిమాలో ఐటెమ్ సాంగ్ కోసం మంచి హీరోయిన్ ని సెట్ చేయాలని అనుకుంటున్నారట.
ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ ఐటెమ్ సాంగ్ కోసం అదిరిపోయే ట్యూన్ రెడీ చేశారట. ఇక అందుకోసం బాలీవుడ్ నుంచి ఒక హాట్ బ్యూటీని దింపాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని భాషలకు తెలిసిన హీరోయిన్ అయితే బెటర్ అని చిత్ర యూనిట్ కత్రినా కైఫ్, జాక్వాలిన్ ఫెర్నాండెజ్, మలైకా అరోరా వంటి వారిని సంప్రదిస్తున్నారట.
ఒకవేళ వారు రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేస్తే దిశా పటాని, పూజా హెగ్డే వంటి వారిని ఫైనల్ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి సుకుమార్ ఎవరిని ఫిక్స్ చేస్తాడో తెలియాలి అంటే మారికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.