Don't Miss!
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సునీల్ తెరవెనక చేష్టలే... ప్లాపుకి కారణం??
హైదరాబాద్ :సునీల్, ఇషాచావ్లా హీరో,హీరోయిన్స్ గా మెగా సూపర్గుడ్ ఫిలింస్ పతాకంపై రూపొందించిన చిత్రం 'మిస్టర్ పెళ్లికొడుకు'. మొన్న శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మార్నింగ్ షోకే ప్లాపు టాక్ తెచ్చుకుంది. అయితే ఈ ప్లాపుకు కారణం ఎవరు అనే టాపిక్ గత కొద్ది రోజులుగా ఫిల్మ్ సర్కిల్స్ లో నడుస్తోంది. అక్కడ చర్చించుకునేదాన్ని బట్టి..సినిమా షూటింగ్ సమయంలో సునీల్ కీ,దర్శకుడుకీ విభేధాలు వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. సునీల్ పూర్తిగా దర్శకుడు పనిలో ఇంటర్ ఫియర్ అవటం మొదలుపెట్టడం జరిగిందని అంటున్నారు. దాంతో మంచి కామెడీ చిత్రాలు తీసిన దేవిప్రసాద్ కూడా స్వేఛ్చ కోల్పోవటంతో ఏమీ చేయలేని సిట్యువేషన్ ఏర్పడిందని చెప్పుకుంటున్నారు.
అంతేకాక మొదట ఈ చిత్రంలో రంగం, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ హీరోయిన్ పియా వాజపేయి ని పెడదామనుకున్నారని అయితే సునీల్ ..ఇషా ఛావ్లానే పెట్టాలని పట్టుబట్టాడని, ఆమె నటనే సినిమాకు మైనస్ గా మారిందని మరో వాదన వినిపిస్తోంది. అంతేకాక సినిమా క్లైమాక్స్ సీన్స్ తనే ప్లాన్ చేసుకున్నాడని, స్క్రిప్టులో కూడా మార్పులు చేసాడని, ఇషా ఛావ్లా సన్నివేశాలు..తనే దగ్గరుండి షూట్ చేయించాడని అంటున్నారు. ఇక ఎడిటింగ్ లో పూర్తిగా ఇన్వాల్స్ అయిన సునీల్ తనే మార్పులు చెప్పాడని, హిట్టయినా, ప్లాప్ అయినా ఈ సినిమా హోల్ రిజల్ట్ సునీల్ కే చెందుతుందని అంటున్నారు.
మార్చి 1న దేవిప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మార్నింగ్ షోకే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. పూల రంగడు చిత్రంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సునీల్ ఈ సినిమాతో చతికలపడ్డారు. ఈ చిత్రం యుస్ లో 50 లో స్క్రీన్స్ లో విడుదల అయ్యింది. వీకెండ్ లో మరీ తక్కువగా అంటచే కేవలం 7 లక్షలు ($ 12,666) వసూలు చేసింది. ఓవర్ సీస్ మార్కెట్ లో ఈ మధ్యకాలంలో ఇంత తక్కువ కలెక్టు చేసిన చిత్రం ఇదే అంటున్నారు.
మాధవన్, కంగనా రనౌత్ జంటగా నటించిన బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'తను వెడ్స్ మను'కు రీమేక్గా తయారైన ఈ చిత్రం ఒరిజనల్ చిత్రం ప్లేవర్ సినిమాలో లేకపోవటం మైనస్ గా మారింది. పూల రంగడు చిత్రం తర్వాత వస్తున్న సునీల్ చిత్రం కావటంతో ట్రేడ్ లో సైతం మంచి బిజినెస్ జరిగింది. సునీల్ సైతం ఈ చిత్రం విజయంపై పూర్తి నమ్మకంగా ఉన్నారు. అయితే అందరి అంచనాలను తారుమారు చేసిందీ చిత్రం.