Don't Miss!
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
'భీమవరం బుల్లోడు' రిలీజ్ ఈ వారం లేనట్లే
హైదరాబాద్ : సునీల్ హీరోగా ఉదయశంకర్ దర్శకత్వంలో సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'భీమవరం బుల్లోడు'. ఈ సినిమా అన్ని కార్యకమ్రాలు పూర్తి చేసుకుని ఈ నెల 14న సినిమాని విడుదలకు సిద్దమైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం విడుదల వాయిదా పడిందని ఫిల్మ్ నగర్ సమాచారం. తెలంగాణా బిల్లు రాజ్య సభలో ప్రజెంట్ చేయనున్న ఈ స్దితిలో రాష్ట్రంలో ఆందోళనలకు ఆస్కారం ఉంది. దాంతో థియోటర్స్ క్లోజ్ చేయవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకునే సురేష్ బాబు వాయిదా వేయాలనుకుంటున్నారని చెప్పుకుంటున్నారు.
భీమవరం బుల్లోడు ఎవర్ని ప్రేమించినా వాళ్లకి వేరే వాళ్లతో పెళ్త్లెపోతుంటుంది. అందుకే ఇంకెవరితోనూ తన ప్రేమను వ్యక్తపరచకూడదు అనుకుంటాడు. ఆ తర్వాత ఓ అమ్మాయిపై మనసు పడినా ఆసంగతి చెప్పడు. కానీ ఆ భామకీ బుల్లోడిపై ప్రేమ పుడుతుంది. మరి వీరిద్దరి కథ ఏమైందనేదే 'భీమవరం బుల్లోడు' సినిమా అన్నారు సునీల్. ఈ సినిమాలో ఎస్తేర్ నాయిక. ఉదయశంకర్ దర్శకుడు. డి. సురేష్బాబు నిర్మాత.
సురేష్ బాబు మాట్లాడుతూ...'సినిమా బాగా వచ్చింది. పూర్తి స్థాయి ఎంటర్టైనర్గా సినిమా రూపుదిద్దుకుంది. ఆడియోలో లేని కొత్త పాటను సినిమాలో జత చేశాం' అన్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్న ఈచిత్రాన్ని 'కలిసుందాం..రా!, ప్రేమతో..రా!, రారాజు, బలాదూర్' వంటి సినిమాలను తెరకెక్కించిన ఉదయ్ శంకర్ దర్శకత్వం వహించారు. 'వేయి అబద్దాలు' ఫేమ్ ఎస్తేర్ హీరోయిన్ గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతమందించారు.
హీరో సునీల్ మాట్లాడుతూ 'కమెడియన్గా నా నుంచి ప్రేక్షకులు మిస్సవుతున్న ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉంటుంది' అన్నారు. దర్శకుడు ఉదయ్ శంకర్ మాట్లాడుతూ- భీమవరం బుల్లోడు చిత్రం తో మరోసారి ఈ సంస్థలో పనిచేయడం ఆనందంగా ఉందని, సునీల్ పాత్ర వైవిధంగా ఉంటుందని తెలిపారు. భీమవరం నివాసి అయిన సునీల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఈ పేరు పెట్టడం విశేషమని, పాడింగ్ ఆర్టిస్టులందరూ చిత్రంలో నటిస్తున్నారని అన్నారు.
తనికెళ్ల భరణి, ఎస్తేర్, జయప్రకాష్రెడ్డి, షాయాజీ షిండే, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, అదుర్స్ రఘు, సత్యం రాజేష్, గౌతమ్రాజు, శ్రీనివాసరెడ్డి, తా.రమేష్, సమ్రాట్, తెలంగాణ శకుంతల, సన, శివపార్వతి, బెంగుళూరు పద్మ, విష్ణుప్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, కథ:కవి కాళిదాస్, మాటలు:శ్రీధర్ శీపన, కెమెరా:సంతోష్రాయ్, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాత:డి.సురేష్బాబు, స్క్రీన్ప్లే, దర్శకత్వం:ఉదయ్ శంకర్.