Don't Miss!
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వరుణ్ తేజతో అనుకుంటే సునీల్ సీన్ లోకి
హైదరాబాద్ : ‘బిందాస్', ‘రగడ' చిత్రాల దర్శకుడు వీరూపోట్లతో సునీల్ జట్టుకట్టబోతున్నారని సమాచారం. అతి త్వరలో ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లనున్నదని తెలుస్తోంది. వినోదం, యాక్షన్ కలబోతగా సాగే ఈ చిత్రంలో సునీల్ పాత్ర వైవిధ్యంగా సాగబోతోందట. ప్రస్తుతం హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
కొద్ది రోజుల క్రితం వరుణ్ తేజ తో దర్శకుడు వీరుపోట్ల చిత్రం చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టు ఇప్పుడు గోపిచంద్ మలినేనికి వెళ్లిందని చెప్తున్నారు. ఆ చిత్రానికి కథ ని వెలిగొండ శ్రీనివాస్ ఇవ్వబోయారని, కథ బాగున్నా..తాను రచయిత కావటంతో ఆ ప్రాజెక్టు వద్దనుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.
సునీల్ విషయానికి వస్తే... ‘భీమవరం బుల్లోడు' తరవాత సునీల్ సినిమా ఏదీ విడుదల కాలేదు. కథల విషయంలో ఆచితూచి వ్యవహరించిన సునీల్ ఇప్పుడు జోరు పెంచేశారు. వరుసగా తన సినిమాల్ని పట్టాలెక్కిస్తున్నారు. ‘కృష్ణాష్టమి' త్వరలో విడుదల కాబోతోంది. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఓ చిత్రం సెట్స్పై ఉంది. ఈలోగా మరో సినిమాపై సంతకం చేశారు.