Don't Miss!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
హాట్ న్యూస్: సునీల్ సినిమా ఆగిపోయినట్లే!?
సునీల్ హీరోగా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో 'సంబరాల రాంబాబు' చిత్రం మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగిపోయిందని వినపడుతోంది. కొద్ది రోజుల క్రితం డి.సురేష్ బాబు సునీల్ సినిమా అట్టహాసంగా ప్రారంభించారు. కలిసుందాం రా ఫేమ్ ఉదయ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా మొదలెట్టారు. అయితే దర్శకుడుకి, నిర్మాతకి వచ్చిన విభేధాలుతో సినిమా ఆగిపోయినట్లు చెప్పుకుంటున్నారు. అయితే అపీషియల్ గా న్యూస్ రాలేదు.
ఇక ఈ సినిమా ఆగిపోవటానికి కారణం బడ్జెట్ ఎక్కువ కావడమేనని చెప్పుకుంటున్నారు. స్క్రిప్టుపై అప్పటికే రెండేళ్లుకు పైగా కసరత్తులు చేసి ఈ ప్రాజెక్టు కోసం ఎదురుచూసిన ఉదయ్ శంకర్ కి ఇది నిరాశపరిచే అంశమే. గతంలోనూ సురేష్ ప్రొడక్షన్స్ ఇదే పంధాలో దర్శకుడు తేజతో మొదలెట్టిన సావిత్రి ప్రాజెక్టుని అటెకెక్కించేసారు. ఆ సినిమామీద తేజ దాదాపు రెండు సంవత్సరాలుకు పైగా సురేష్ ప్రొడక్షన్స్ లో కుస్తీ పట్టారు.
ఇక ఈ చిత్రం తీసుకున్న డేట్స్ లో అమృతం సినిమాని గుణ్ణం గంగరాజుతో లాగించేయాలని సురేష్ బాబు ప్లాన్ చేసారని తెలుస్తోంది.గుణ్ణం గంగరాజు డైరక్ట్ చేసిన జస్ట్ ఎల్లో వారి అమృతం టీవి సీరియల్ తెలుగు వారికి సుపరిచితమే. ఓ హోటల్ చుట్టూ తిరిగే కథలో అల్లుకున్న ఎపిసోడ్స్ తో వారం వారం తెలుగువారిని గిలిగింతలు పెట్టిన ఈ టీవీ సీరియల్ సినిమాగా రానుంది. సునీల్ హీరోగా రూపొందే ఈ చిత్రాన్ని గుణ్ణం గంగరాజే తెరకెక్కించనున్నారని చెప్తున్నారు. సురేష్ బాబు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహించనున్నారని సమాచారం.
జస్ట్ యల్లో బ్యానర్ ,సురేష్ ప్రొడక్షన్స్ కలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. అయితే సీరియల్ క్యారెక్టర్స్ తో సినిమా చేస్తారా లేక, కథ కూడా తీసుకుని చేస్తారా అనేది మాత్రం తెలియటం లేదు. ఇప్పటికే ఈ చిత్రం స్క్రిప్టు పూర్తైందని తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందని వినికిడి. పూర్తి స్ధాయి కామెడీగా ఈ చిత్రాన్ని గుణ్ణం గంగరాజు తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.