Don't Miss!
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Lifestyle పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘సాహో’లో అదిరిపోయే ట్విస్ట్.. దానిపైనే ఆధారం.. మామూలుగా ఉండదట
తెలుగు సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమాల్లో 'సాహో' ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్తో 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 30న నాలుగు భాషల్లో విడుదల కాబోతుంది. గతంలో విడుదలైన టీజర్తో పాటు ఇటీవల వచ్చిన ట్రైలర్కు భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.
త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఇప్పటికే ప్రభాస్ - శ్రద్ధాకపూర్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. శుక్రవారం చిత్ర యూనిట్ తమిళనాడులో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో అంగరంగ వైభవంగా చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.
ఒకవైపు ప్రమోషన్లతో చిత్ర యూనిట్ బిజీ బిజీగా గడుపుతున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్గా కనిపించనున్న విషయం తెలిసిందే. ఫస్టాఫ్ మొత్తం దొంగను పట్టుకోడానికి చేసే ప్రయత్నాలతో సినిమా మీద ఆసక్తి పెంచేస్తాడట. ఇక, సెకెండాఫ్ స్టార్టింగ్లోనే సినిమాలో భారీ ట్విస్ట్ వస్తుందని తాజాగా ఓ న్యూస్ ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఈ ట్విస్ట్ కథను పూర్తిగా మలుపు తిప్పబోతుందట. అంతేకాదు, ఈ సీన్ వచ్చినప్పుడు బ్యాగ్రౌండ్ స్కోర్ హై లెవెల్లో ఉంటుందని సమాచారం. ఈ సీన్ వచ్చిన సమయంలో ప్రేక్షకులు సీట్లలో కూడా కూర్చోలేరని అంటున్నారు. అంతలా దీన్ని డిజైన్ చేశాడట డైరెక్టర్ సుజిత్. ఈ వార్త విన్న తర్వాత సినిమాపై ఆసక్తి మరింత పెరిగిపోయిందనడంలో సందేహం లేదు.