Don't Miss!
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అట్టర్ ప్లాప్ నుంచి మహేష్ బాబు ఎస్కేప్.. రజనీకాంత్ చేతులమీదుగా!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటుడిగానే కాదు, బ్రాండ్ అంబాసిడర్ గా పలు సంస్థలకు పనిచేస్తున్నాడు. అదే సమయంలో వ్యాపారరంగంలో కూడా మహేష్ బాబు రాణిస్తున్నాడు. ఇదిలా ఉండగా మహేష్ బాబుకు చెందిన ఏఎంబి మల్టిఫ్లెక్ ఆసక్తిని రేపుతోంది. హైదరాబాద్ లో మహేష్, ఏషియా ఫిలిమ్స్ సంస్థ కలసి ఏఎంబి మల్టిఫ్లెక్స్ ని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ మల్టిఫ్లెక్స్ ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర ప్రచారం జోరుగా సాగుతోంది.
అట్టర్ ప్లాప్ నుంచి ఎస్కేప్
ముందుగా ఏఎంబి మల్టిఫ్లెక్స్ ని అమిర్ ఖాన్ నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రంతో ప్రారంభించాలని ప్రయత్నించారు. కానీ ఆ సమయానికి నిర్మాణం పూర్తి కాకపోవడంతో అది కుదర్లేదు. దీనితో మహేష్ బాబు అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రం డిజాస్టర్ దిశగా సాగుతోంది.
క్రేజీ చిత్రంతో ప్రారంభం
తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు తన మల్టి ఫ్లెక్స్ ని దేశం మొత్తం ఎదురుచూస్తున్న 2.ఓ చిత్రంతో ప్రారంభించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ మల్టిఫ్లెక్స్ థియేటర్ ని 2.ఓ లాంటి 3డి చిత్రంతో ప్రారంభిస్తే బావుంటుందని భావిస్తున్నారు.
మహేష్ కోసం తలైవా
ఈ మల్టిఫ్లెక్స్ ఓపెనింగ్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. రజనీ చేతుల మీదుగా మహేష్ మల్టిఫ్లెక్స్ థియేటర్స్ లాంచ్ అయితే ఇద్దరు సూపర్ స్టార్స్ ని ఒకే వేదికపై చూడవచ్చు.
మహర్షి వచ్చే ఏడాది
మహేష్ బాబు నటించే చిత్రం ఏఎంబి మల్టిఫ్లెక్స్ లో ప్రదర్శించాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న మహర్షి చిత్రం 2019 సమ్మర్ లో విడుదల కానుంది. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.