Don't Miss!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
బాలయ్య వందో సినిమాకు హీరో సూర్య ట్విస్ట్?
హైదరాబాద్ : బాలకృష్ణ తన వందో సినిమాని ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్ ఆదిత్య 999 గా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభం కాకముందే..ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తమిళ హీరో సూర్య తాజా చిత్రం '24' కథ కూడా టైం మిషన్ చుట్టూ తిరగుతుందని తెలుస్తోంది. హీరో సూర్య...తన వద్ద ఉన్న టైం మిషన్ తో ...భూత, భవిష్యత్ కాలాల మధ్య ప్రయాణం చేస్తాడట.
అంటే ఆదిత్య 369 సీక్వెల్ కంటే ముందు విక్రమ్ తీస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా సూర్యకు ఉన్న మార్కెట్ తో భారీగా విడుదల చేస్తారు. అలాంటప్పుడు దాదాపు అలాంటి కథతో బాలయ్య...సినిమా వస్తే పెద్ద గ్యాప్ ఉన్నట్లు ఉండదు. బాలయ్యది టైం మిషన్ కథ కాకపోతే ఏ సమస్యా రాదు అనేది నిజం.
బాలకృష్ణ తన తాజా చిత్రం డిక్టేటర్ విజయోత్సాహంలో ఉన్నారు. మరో ప్రక్క ఆయన తన వందో చిత్రం అఫీషియల్ గా ప్రకటించి నందమూరి అబిమానులకు ఆనందం కలుగచేసారు. వందో చిత్రంగా రూపొందనున్న ‘ఆదిత్యా 369' చిత్రానికి సీక్వెల్ ‘ఆదిత్యా 999' ఎప్పుడు రిలీజ్ అవుతుందనేదనేది అందరికీ ఆసక్తే.
అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ వందో చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుందని తెలుస్తోంది. అంటే 2017కి బాలయ్య ఇప్పటినుంచే కసరత్తులు మొదలెట్టాడన్నమాట. తన కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాలని ఆయన భావిస్తున్నారు. విఎఫ్ ఎక్స్, గ్రాఫిక్స్ కు ఎక్కువ సమయం పట్టనుండటంతో ఈ మాత్రం టైమ్ పడుతుందని భావిస్తున్నారు. ఈ కాలం ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లు ఈ వందో చిత్రం రూపొందనుంది.
గత కొద్ది కాలంగా నందమూరి అబిమానుల్లో ఉన్న ప్రశ్న... నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ఏ దర్శకుడితో ఉంటుంది? ఎలాంటి చిత్రం చేస్తారు? ఈ ప్రశ్నకు మొన్నీ మధ్యే సమాధానం దొరికింది. హైదరాబాద్లో జరిగిన 'డిక్టేటర్' విజయోత్సవంలో వందో చిత్రం గురించి బాలకృష్ణ స్పష్టంగా ప్రకటించారు.
పాతికేళ్ల క్రితం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తాను చేసిన 'ఆదిత్య 369'కు సీక్వెల్గా రూపొందనున్న 'ఆదిత్య 999' తన వందో చిత్రమని తెలిపారు. ఈ సీక్వెల్ కూడా సింగీతం దర్శకత్వంలోనే రూపొందనుందని చెప్పారు. ఇప్పటికే స్టోరీబోర్డ్తో సహా సిద్ధమైన ఈ కథ త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది.
సింగీతం మాట్లాడుతూ..."బాలకృష్ణతో ఆదిత్య 369 కొనసాగింపు చిత్రం కి కథని సిద్ధం చేస్తున్నాం. సినిమాకి ఆదిత్య999 అని పేరు కూడా అనుకుంటున్నాం. అయితే దీనికి కాస్త సమయం పడుతుంది. పాత సినిమాకి ఏం మాత్రం సంబంధం లేని సినిమాగా రూపొందిస్తాం" అంటూ చెప్పుకొచ్చారు . ప్రముఖ నిర్మాత కొండా కృష్ణంరాజు ఈ చిత్రానికి సమర్పకుడుగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం.త్వరలో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనున్నట్లు సినీ వర్గాల సమాచారం.