Don't Miss!
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘బాహుబలి’ తల్లి గా నాగ్ హీరోయిన్
తాజాగా ఆ పాత్రలో విశ్వసుందరిగా ఎన్నికై, రక్షకుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుస్మితాసేన్ నటించనుందని మరో పేరు వార్తల్లోకి వచ్చింది. అప్పట్లో నాగార్జున హీరోగా నటించిన 'రక్షకుడు' చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా కనిపించింది. ఆ తర్వాత సుస్మితకు ఎలాంటి అవకాశాలు తెలుగులో రాలేదు.
దాదాపుగా సుస్మిత గురించి తెలుగు ప్రేక్షకులు మరిచిపోతున్న తరుణంలో 'బాహుబలి' చిత్రంలో హీరో తల్లిగా నటించనుందన్న వార్తతో తెరపైకి వచ్చింది సుస్మిత. దర్శకుడు సుస్మితకు చిత్రంలోని ప్రధాన కథను, ఆమె పాత్రలో విశిష్టతను చెప్పడంతో, దాదాపు కోటి రూపాయల పారితోషికాన్ని ఇవ్వజూపడంతో సుస్మిత ఈ పాత్రను చేయడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.
అయితే కోటి రూపాయలు పెట్టి సుస్మితను తీసుకునే కన్నా తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు ఉన్న శ్రీదేవిని ఆ పాత్రకు ఎంపిక చేస్తే ఎలా ఉంటుందని, మరికొందరు సలహాలు ఇస్తున్నారట. శ్రీదేవి అయితే ఆ చిత్రానికి అదనపు ఆకర్షణ లభిస్తుందని కూడా వారు చెబుతున్నారు.
ఐతే ఇంగ్లీష్-వింగ్లీష్ చిత్రంతో తాను హీరోయిన్ గానే నటిస్తానని చెప్పకనే చెప్పిన శ్రీదేవి ఇందుకు ఒప్పుకుంటుందా లేదా అనేది కూడా తెలియాలి. మొత్తానికి 'బాహుబలి' తల్లి ఎవరు అనేది మాత్రం ఇంకా ఖరారు కాని విషయమే! ఈ చిత్రం ఈనెల 14న షూటింగ్ ప్రారంభించుకోనుంది.
ఈ విషయమై నిర్మాత దేవినేని మాట్లాడుతూ... మేము శ్రీదేవిని,సుస్మితాని కన్సిడర్ చేసిన మాట నిజమే. కానీ ఎవరనీ ఇంకా ఖరారు చేయలేదు. ఇంకా ఆప్షన్స్ వెతుకుతున్నాం..త్వరలోనే ఫైనలైజ్ చేస్తాం అన్నారు.