twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోహన్ బాబు, బ్రహ్మానందం గట్టిగానే ఛార్జ్ చేసారు

    By Srikanya
    |

    హైదరాబాద్: త్వరలో యముడు గా మోహన్ బాబు, చిత్రగుప్తుడు గా బ్రహ్మానందం కనిపించి వెండితెరపై నవ్వులు పూయించనున్నారు. యమలీలకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వీరిద్దరు ఎంపిక పూర్తైంది. ఇక యముడుని ఆడించే భూలోక వాసిగా కొత్త కుర్రాడు కనిపిస్తాడని తెలుస్తోంది. ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సీక్వెల్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ విజయవంతంగా మొదలెట్టాలని భావిస్తున్నాడు.

    ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం...ఈ చిత్రంలో నటించటానికి గానూ మోహన్ బాబు రెండు కోట్లు,బ్రహ్మానందం యాభై లక్షలు ఛార్జ్ చేస్తున్నారని తెలుస్తోంది. మొదట మరోసారి యముడుగా చేయటానికి మోహన్ బాబు ఒప్పుకోలేదని, అయితే కృష్ణారెడ్డి ఒప్పించి,ఆయన కోరిన మొత్తం ఇవ్వటానికి ఒప్పుకున్నారని చెప్పుకుంటున్నారు. అయితే ఈ కాలంలో యముడుగా చేయటానికి, ఆ తరహా డైలాగులు చెప్పటానికి కూడా ఆప్షన్ ఎవరూ కనపడకపోవటంతో నిర్మాతలు సైతం తమకు పెద్ద మొత్తం అనిపించినా,మారు మాట్లాడకుండా అడ్వాన్స్ ఇచ్చి డేట్స్ ఖరారు చేసుకున్నారని చెప్పుకుంటున్నారు.

    SVK striking back with his sequel

    కొత్త నిర్మాతలు నిర్మించే ఈ చిత్రం ఎస్వీ కృష్ణారెడ్డి కెరీర్ లోనే హై బడ్జెట్ చిత్రమని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ మేరకు స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. బిజినెస్ సైతం క్రేజ్ గా జరుగుతుందని భావిస్తున్నారు. సీక్వెల్స్ హవా నడుస్తున్న ఈ రోజుల్లో ఓ సూపర్ హిట్ కు సీక్వెల్ ని అదీ క్రేజీ కాంబినేషన్ లో వస్తూండటంతో ట్రేడ్ వర్గాలలోనూ ఆసక్తి నెలకొని ఉంది.

    ఎన్టీఆర్ సూపర్ హిట్ చిత్రం యమ దొంగ లో యముడుగా నటించి మెప్పించిన మోహన్ బాబు మరోసారి యముడుగా కనిపించనుండటంతో సినిమా సగం విజయం సాధించినట్లే అంటున్నారు . 1994లో మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన సోషియో ఫాంటసీ చిత్రం 'యమలీల'. ఎస్వీకృష్టాడ్డి దర్శకత్వంలో అలీ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో అందిరికి తెలిసిందే. ఈ చిత్రం సీక్వెల్ లో ఆయన యమధర్మరాజు గా కనిపించనున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.

    ఇక మోహన్ బాబు నిర్మిస్తునవ్న ఫ్యామిలీ మల్టీస్టారర్ చిత్రం 'పాండవులు పాండవులు తుమ్మెద' లో మోహన్ బాబు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియోను డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా సినిమాను సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రొడక్షన్ హౌస్ నుంచి అందిన సమాచారం. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్-24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై అరియానా-వివియానా సమర్పణలో మంచు విష్ణువర్ధన్-మనోజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    English summary
    SV.Krishna Reddy who scored a super hit with ‘Yamaleela’ is planning its sequel soon. Currently script work is going on and Allari Naresh is playing male lead role in this flick. Now latest news is that Mohan Babu is charging Rs.2 crores remuneration for the role of ‘Yamudu’ and Brami is charging Rs.50lakhs for Chitragupta role. This film is going to high budget film in SV Krishna Reddy career which is produced by new producers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X