Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మెగా హీరోతో ‘స్వామి రా.. రా...’ దర్శకుడు చిత్రం?
హైదరాబాద్ : 'స్వామి రా.. రా...' వంటి చిన్న చిత్రంతో హిట్ కొట్టిన దర్శకుడు సుధీర్ వర్మ కి ఇప్పుడు ఇండస్ట్రీ వరస ఆఫర్స్ తో పలకరిస్తోంది. తాజాగా మెగా క్యాంప్ కు చెందిన అల్లు అర్జున్ కి కథ చెప్పమని ఆఫర్ వచ్చిందని సమాచారం. ఛత్రపతి బి.వియస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాసం ఉందని తెలుస్తోంది.
ఇక ఈ చిత్రం గురించి హీరో నిఖిల్ మాట్లాడుతూ... 'చిన్న సినిమాను ఆదరాభిమానాలతో పెద్ద సినిమాను చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ప్రతి చోటా హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోందీ సినిమా'' అని అన్నారు. నిఖిల్, స్వాతి జంటగా సుధీర్వర్మ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మించిన చిత్రం 'స్వామి రా.. రా...' గత వారం విడుదలైంది.
అందరి సహకారం వల్లే ఇంతబాగా చిత్రాన్ని పూర్తి చేయగలిగానని, ఊహించని విజయం ఇదని దర్శకుడు చెప్పారు. ''రాకింగ్ కలెక్షన్లతో దూసుకుపోతోందీ సినిమా. ఈ క్రెడిట్ మొత్తం దర్శకునికే చెందుతుంది'' అని కలర్స్ స్వాతి చెప్పారు. ఈ సినిమాతో మాకు పూర్వవైభవం వచ్చినట్లయ్యిందని జోగిబ్రదర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రామ్ గోపాల్ వర్మ అనగనగా ఒక రోజు, క్షణ క్షణం చిత్రాలకు గుర్తు చేస్తూ సాగే ఈ చిత్రం మార్నింగ్ షోకే హిట్ టాక్ తెచ్చుకుంది. నిఖిల్ గత ఫ్లాప్ చిత్రాల ఎఫెక్టుతో ఓపినింగ్స్ లో ఊపు లేకపోయినా తర్వాత టాక్ స్ప్రెడ్ కావటంతో పుంజుకున్నాయి. US లో కూడా ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి హీరో నారా రోహిత్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. రొమాంటిక్,యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందిందారు.
చిత్రంలో వినాయకుడి విగ్రహానికీ, ఓ దొంగ ప్రేమ కథకూ సంబంధం ఏమిటనేది ఆసక్తికరం. కథ ప్రకారం సూర్య (నిఖిల్) ఓ జేబుదొంగ. బతుకుదెరువు కోసం దొంగతనాలు చేస్తుంటాడు. అతనికి స్వాతి (స్వాతి) అనే ఓ పాత్రికేయురాలితో పరిచయం అవుతుంది. మరోవైపు అనంతపద్మనాభస్వామి గుడిలో కనీవినీ ఎరుగని సంపద దొరుకుతుంది. అయితే అందులోంచి ఓ వినాయక విగ్రహం మాయం అవుతుంది. ఆ విగ్రహం కోసం కొంతమంది అన్వేషణ మొదలుపెడతారు. సూర్య, స్వాతిలు కూడా విఘ్నేశ్వరుడి కోసం వేట ప్రారంభిస్తారు. ఇంతకీ ఆ విగ్రహం ఏమైంది? ఎవరికి దొరికింది? అనేదే చిత్ర కథ.