Don't Miss!
- News ఎండలో తిరిగితే జ్వరం..పూలు వేస్తే ఎలర్జీ..నీకు రాజకీయాలెందుకు..?
- Sports DC vs SRH:ట్రావిస్ హెడ్, షెహ్బాజ్ అహ్మద్ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
బాలకృష్ణ సరసన శ్వేతాబసు ఎంపిక?
సింహా చిత్రంలో బాలకృష్ణ సరసన చేసిన స్నేహా ఉల్లాల్ మిగతా జూనియర్ హీరోయిన్స్ కి ప్రేరణ ఇస్తున్నట్లుంది. తాజాగా కొత్త బంగారు లోకం ఫేమ్ శ్వేతాబసు ని కూడా బాలయ్య సరసన చేసేందుకు ఒప్పించినట్లు తెలుస్తోంది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో బాలకృష్ణ చేయబోయే చిత్రంలో ఆమెను సెకెండ్ హీరోయిన్ గా అడిగారని ఫిల్మ్ నగర్ వార్త. ఇక ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. మొయిన్ హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఇక శ్వేతాబసు గతంలో బెల్లంకొండ నిర్మాతగా వచ్చిన రైడ్ చిత్రంలో హీరోయిన్ గా చేసింది. ఇక బెల్లంకొండ, బాలకృష్ణల కాంబినేషన్ లో ఇది మూడో చిత్రం. మొదట చెన్నకేశవ రెడ్డి, ఆ తర్వాత లక్ష్మీ నరసింహ చిత్రాలు బెల్లంకొండ భారీగా నిర్మించారు. ఇక ఈ పూరీ తో చేయబోయే చిత్రం గురించి బెల్లంకొండ...బాలయ్యబాబు కెరీర్ లోనే ఓ సెన్సేషనల్ మూవీగా నిలిచేవిధంగా హై రేంజ్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తాం అన్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాధ్...తన లేటెస్ట్ చిత్రం గోలీమార్ ప్రి రిలీజ్ హడావిడిలో ఉన్నారు. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన ప్రియమణి చేస్తోంది.