Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ముందు ఎవరు దొరికితే వారితోనే.. సైరా దర్శకుడి న్యూ ప్లాన్!
సైరా సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని బాగానే కష్టపడిన దర్శకుడు సురేందర్ రెడ్డి అనుకున్నంతగా అయితే అంచనాలను అందుకోలేకపోయారు. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయగా తెలుగులో తప్పితే మిగతా చోట్ల పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను తెరకెక్కించగలడని మాత్రం నిరూపించుకున్నాడు.
ఇక నెక్స్ట్ ఈ స్టార్ డైరెక్టర్ మళ్ళీ తన రెగ్యులర్ కంఫర్ట్ జోన్ లోనే ఒక కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే మూడు కథలను సెట్ చేసుకున్న సురేందర్ రెడ్డి హీరోలను వెతికే పనిలో పడ్డాడు. ముందుగా రామ్ కోసం ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో కూడా చర్చలు జరుపుతున్నట్లు టాక్ వచ్చింది. ఇక అఖిల్ కోసం కూడా మాస్ యాక్షన్ కథను రెడీ చేసినట్లు రూమర్స్ వచ్చాయి.
ఇక ఇప్పుడు ఫైనల్ గా రవితేజతో కూడా సురేందర్ రెడ్డి ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియదు గాని సురేందర్ రెడ్డి మాత్రం ముందు ఎవరు దొరికితే వారితో సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడట. కానీ వారి డేట్స్ దొరకడం కష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సైరా లాంటి పెద్ద సినిమా అనంతరం సురేందర్ రెడ్డి మిడియమ్ హీరోలను సెలెక్ట్ చేసుకోవడం కంటే ఆయన స్థాయికి తగ్గట్లు మరో పెద్ద హీరోను సెలెక్ట్ చేసుకుంటేనే బెటర్ అంటూ కొందరు సలహాలు ఇస్తున్నారట. మరి దర్శకుడు సురేందర్ రెడ్డి ఫైనల్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడో చూడాలి.