Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సైరా నరసింహారెడ్డి ఇంత వేగంగానా..ప్రభాస్తో పోటీ, మెగా ఫాన్స్కు గుడ్ న్యూస్!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మెగాపవర్ స్టార్ రాంచరణ్ స్వయంగా ఈ చిత్రాన్ని 200 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తుండడం విశేషం. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. నరసింహారెడ్డి వీరత్వాన్ని ప్రతిభింబించేలా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్నా, అమితాబ్ బచ్చన్, విజయ సేతుపతి లాంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా సైరా షూటింగ్ కు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది.
ఆగష్టులోనే
ముందుగా సైరా నరసింహారెడ్డి చిత్రాన్నిఆగష్టులో విడుదల చేయాలని భావించారు. కానీ షూటింగ్ ఆలస్యం జరిగింది. దీనితో సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని దసరాకు విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా షూటింగ్ కి సంబందించిన అందుతున్న విశ్వసనీయ సమాచారం ద్వారా సైరా చిత్రం ఆగష్టులోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మార్చిలో ఫినిష్
తాజాగా సమాచారం ప్రకారం మార్చి మొదటి వారంలో సైరా నరసింహారెడ్డి కీలక షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ తో క్లిష్టమైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిపోతుందట. ఆ తర్వాత చిత్రంలోని కీలక నటులందరితో ఓ సన్నివేశాన్ని నాలుగు రోజుల షూటింగ్ లో పూర్తి చేస్తారు. దీనితో షూటింగ్ మొత్తం దాదాపుగా పూర్తయినట్లే అని అంటున్నారు. ఇక మిగిలింది పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మాత్రమే.
సాహోతో పోటీ
దీనితో ఆగష్టులోనే సైరా నరసింహరెడ్డి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక విడుదల తేదికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రమే మిగిలివుంది. ఆగష్టులో మరో భారీ బడ్జెట్ చిత్రం సాహో విడుదల కానుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇద్దరు బడా హీరోల చిత్రాలు ఒకే నెలలో విడుదలైతే బాక్సాఫీస్ వద్ద తప్పనిసరిగా పోటీ ఉంటుంది.
గుర్తింపు లభించలేదు
విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు, తమన్నా లాంటి క్రేజీ నటులంతా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇక బిగ్ బి అమితాబ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. స్వాతంత్ర సమరాన్ని ఆరంభించిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి. కానీ ఆయనకు సరైన గుర్తింపు లభించలేదు. ఈ చిత్రం ద్వారా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ప్రజల్లోకి వెళుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.