Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కొరటాల దర్శకత్వంలో చిరు 152వ చిత్రం.... హీరోయిన్ ఖరారైందా?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో 152వ సినిమా చేయబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
చిరు-కొరాటాల ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా మరో ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఇందులో చిరంజీవికి జోడీగా తమన్నాను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. తమన్నా గతంలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి మెగా హీరోలతో జతకట్టింది. తాజాగా ఆమె పేరు చిరంజీవి సినిమాకు వినిపిస్తుండటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.
గతంలో ఓసారి రామ్ చరణ్ సినిమా ఆడియో వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.... తమన్నా టాలెంటుపై ప్రశంసలు గుప్పించారు. తమన్నాతో కలిసి నటించాలని ఉందని ఆ సమయంలో చిరంజీవి సరదాగా వ్యాఖ్యానించారు కూడా. చిరంజీవి అపుడు సరదాగా అన్న విషయం త్వరలో నిజం కాబోతోందని తెలుస్తోంది.
ప్రస్తుతం చిరంజీవి తన 151వ సినిమా 'సైరా'లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ 2019లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది పూర్తయిన తర్వాత కొరటాల శివతో ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. సోషల్ మెసేజ్తో పాటు పూర్తి కమర్షియల్ హంగులతో ఈ సినిమా ఉండబోతోందని తెలస్తోంది.