'ఆర్య' సీక్వెల్ని నేనే వదులుకున్నా

అయితే నెగిటివ్ గా ప్రచారమవుతున్న ఆ వార్తలు ఆమె చెవిని పడినట్లున్నాయి. దాంతో ఇప్పుడామె ఆ సినిమాను తానే వదలుకున్నానని చెబుతోంది. "ఒకే సమయంలో ఎన్ని సినిమాలని చేయను? ఇప్పటికే రెండు సినిమాల్లో చేస్తున్నా. మరో రెండు సినిమాలు ఒప్పుకున్నా. అందుకే నా డేట్లు అడ్జస్ట్ కావడం కష్టమని నిర్మాతకు సున్నితంగా చెప్పా. వచ్చే యేడాది తప్పకుండా ఒక సినిమా చేస్తానని ఆయనకు హామీ ఇచ్చా. ఆయన నా సమస్యను అర్ధం చేసుకున్నారు" అని తెలిపింది తమన్నా.
ఇటీవలే అక్కినేని మనవడు సుశాంత్ సరసన 'కాళిదాసు'లో గ్లామర్తో మెప్పించిన ఆమె మరి కొద్ది రోజుల్లో రవికృష్ణతో 'నిన్న నేడు రేపు' సినిమాలో కనిపించబోతోంది. సిద్ధార్థ్తో 'కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా' సినిమా చేస్తోంది. పవన్ కల్యాణ్ 'పులి'లోనూ ఆమె పేరు వినిపిస్తోంది గానీ, ఇంకా ఫైనల్ కాలేదు.యేదైమైనా వరస ఆఫర్స్ తో దూసుకుపోతున్న ఆమె కెరీర్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.


Click it and Unblock the Notifications











