Don't Miss!
- News పాపం అంబాని, ఆదానిలు చాలా పేదోళ్లు, జస్ట్ రూ 16 కోట్ల రుణమాఫీ చేసిన మోదీ, టార్గెట్ చేసిన సీఎం
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
హాట్ టాపిక్ :మల్టి స్టారర్ లోకి తమన్నా ఎంట్రీ
హైదరాబాద్ : నాలుగేళ్లపాటు కోలీవుడ్లో హవా చాటిన మిల్కీ వైట్ బ్యూటీ.. తమన్నా ఆ మధ్య టాలీవుడ్పై దృష్టి పెట్టింది. ఎన్టీఆర్, మహేష్బాబు, అల్లు అర్జున్, రామ్చరణ్లతోపాటు పలువురు స్టార్ హీరోలందరితో జతకట్టింది. మళ్లీ ఇప్పుడు కోలీవుడ్కు రీఎంట్రీ ఇవ్వబోతోందని సమాచారం. అయితే అది స్ట్రైయిట్ గా కాదు...తెలుగు,తమిళ చిత్రంతో అనితెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు కార్తి. ఈ చిత్రంలో నాగార్జున సైతం కనిపించనున్నారు. నాగార్జున, కార్తీ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం.
రీఎంట్రీలో ఏకంగా అజిత్తో జతకట్టి 'వీరం' వంటి బిగ్గెస్ట్ హిట్ను అందించింది. ప్రస్తుతం సూర్య, విజయ్లతో జతకట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా.. వన్నెతగ్గని సోయగంతో.. దక్షిణాదిలో మోస్టు వాంటెడ్ హీరోయిన్గా హవా చాటుకుంటోంది తమన్నా ఇప్పుడు ఊహించని విధంగా కార్తితో మరోసారి ఈ ప్రాజెక్టులోకి వచ్చిందని సమాచారం.
పూర్తి వివరాల్లోకి వెళితే....వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, తమిళ హీరో కార్తి కలసి మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో ఈ సినిమా షూటింగ్ చేయనున్నారు. ఈ భారి బడ్జెట్ సినిమాను పివిపి సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నాను సెలెక్ట్ చేశారనేది టాక్. ఈ సినిమాలో నాగార్జున, కార్తి ఒకే హీరోయిన్ తో రొమాన్స్ చేస్తారని సమాచారం. అయితే అధికారికంగా దర్శకనిర్మాతల నుండి ఎటువంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుంది.
ఇక గతంలో తెలుగులో నాగార్జున సరసన తమన్నా ఇప్పటివరకు నటించలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే ఇదే తొలి సినిమా అవుతుందని నాగార్జున అభిమానులు ఆనందపడుతున్నారు. మరో ప్రక్క కార్తి,తమన్నాలు తమిళంలో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అవారా' , ‘సిరుత్తై' (విక్రమార్కుడు రీమేక్) సినిమాలు మంచి విజయాలు సాధించాయి. తమన్నా ని తీసుకోవటం వల్ల తమిళంలో కూడా సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడుతుందని తీసుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.