Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రవితేజ సరసన తమన్నా
హైదరాబాద్ :పరాజయంతో కెరీర్ను ప్రారంభించినా, తొందర్లోనే తన తప్పుల్ని సరిదిద్దుకొనే స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది తమన్నా. తెలుగునాట స్టార్ హీరోలతో జతకట్టింది. తమిళ, హిందీసీమల్ని చుట్టొచ్చింది. ఇప్పుడు మరో రౌండ్ వేస్తోంది. తాజాగా ఆమె రవితేజ సరసన నటించనుందని సమాచారం. రచ్చ దర్శకుడు సంపత్ నంది దర్శకుడుగా రూపొందే చిత్రంలో ఆమెను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రచ్చ లోనూ తమన్నానే హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. ఇక రవితేజ కిక్ 2 పూర్తైన వెంటనే ఈ చిత్రం షూటింగ్ కి వస్తారు.
తమన్నా మాట్లాడుతూ ''ఏ విషయంలోనైనా సానుకూల దృక్పథంతో నడుచుకొంటా. నాకు స్నేహితులెక్కువ. అదే నా బలం. అన్ని వయసులవారితోనూ స్నేహం చేస్తా. నా స్నేహితుల్లో నాకంటే పెద్ద వయసున్నవాళ్లున్నారు. చిన్న పిల్లలూ ఉన్నారు. అన్ని వర్గాల అభిరుచుల్నీ తెలుసుకోవడానికి నాకిదో మార్గంగా కనిపించింది. నన్ను ఎవరు, ఎలా చూడాలనుకొంటున్నారనే విషయంలో నాకో నిశ్చితమైన అభిప్రాయం ఉంది. నా సినిమాల గురించి వాళ్లతో మాట్లాడతాను'' అంది.
అలాగే... ''ఏ విషయంలో తప్పు చేశాను? ఎక్కడ పొరపడ్డానో వాళ్లే చెప్పేస్తుంటారు. నా సినిమా విడుదలైందంటే గంటకో రివ్యూ ఇస్తుంటారు. వాళ్ల అభిప్రాయాలకు నేనూ విలువ ఇస్తా. నా దృష్టిలో నా స్నేహితులే ఉత్తమ విమర్శకులు'' అని చెప్పుకొచ్చింది తమన్నా. ప్రస్తుతం 'బాహుబలి'లో ప్రభాస్ సరసన నటిస్తోంది. 2015లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.
చిత్రం విషయానికి వస్తే...
రెండోసారి కిక్ని పంచే ప్రయత్నంలో ఉన్నారు రవితేజ. తదుపరి చేయనున్న మరో చిత్రానికి తాజాగా పచ్చ జెండా వూపేశారు. సంపత్ నంది దర్శకత్వంలో ఆ చిత్రం తెరకెక్కబోతోంది. 'కిక్ 2' పూర్తయిన వెంటనే సెట్స్పైకి తీసుకెళతారు. ఇందులో రవితేజ సరసన ఇద్దరు కథానాయికలు నటిస్తారు.
రవితేజ మాట్లాడుతూ ''సంపత్ నంది చెప్పిన కథ చాలా బాగుంది. ఒక్కసారి వినగానే ఓకే చెప్పేశా. అన్ని వర్గాల్నీ అలరించే అంశాలున్నాయి. మాస్తో పాటు కుటుంబ ప్రేక్షకులకూ నచ్చేలా సంపత్ నంది కథని తీర్చిదిద్దుతున్నాడ''న్నారు. ''రవితేజతో సినిమా చేయాలన్న కోరిక నెరవేరుతుండటం ఆనందంగా ఉంది. రవితేజ నుంచి ప్రేక్షకులు ఏమేం ఆశిస్తారో అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తామ''న్నారు సంపత్ నంది.