రామ్ చరణ్ సరసన తమన్నా ఆ చిత్రంలో?
హ్యాపీ గర్ల్ తమన్నా త్వరలో రామ్ చరణ్ తో చేయనుంది. లింగు స్వామి దర్శకత్వంలో రూపొందనున్న పయ్యా రీమేక్ లో ఆమెను హీరోయిన్ గా ఎంపికచేసినట్లు సమాచారం. తమిళంలో ఆ పాత్రను తమన్నానే చేసింది. దాంతో ఇంప్రెస్ అయిన లింగు స్వామి ఇక్కడ తెలుగు వెర్షన్ కు కూడా ఆమెనే తీసుకోవటానికి ఒప్పించాడు. ఇక పయ్యా చిత్రం ట్రైలర్స్, పాటలు చూసిన మచ్చటపడిన రామ్ చరణ్ ఆ స్టోర్ లైన్ అడిగి తెలుసుకుని అవకాశముంటే తను ఆ సినిమా రీమేక్ లో చేస్తాను అనటంతో ఈ ప్రాజెక్టు మొదలైంది. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్ వారు స్పందించి రామ్ చరణ్ నీ, లింగు స్వామినీ కలిసి కమిట్ మెంట్ తీసుకుని ఈ చిత్రం మెటిరియలైజ్ చేస్తున్నారు. ఇది రామ్ చరణ్ కు నాలుగవ చిత్రం. లింగుస్వామి గతంలో ూపొందించిన రన్, పందెంకోడి చిత్రాలు తెలుగులో మంచి హిట్ అయ్యాయి. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ అనే చిత్రం చేస్తున్నారు. రామ్ చరణ్ సరసన జెనీలియా, కృతి కర్బందా చేస్తున్నారు. తన అంజనా ప్రొడక్షన్స్ పై నాగబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











