Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
షాకింగ్ న్యూస్: ‘రాజు గారి గది 3’ నుంచి తమన్నా తప్పుకుందా?
ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన రాజుగారి గది, రాజుగారి గది 2 చిత్రాలు మంచి విజయం సాధించడంతో ఈ ఫ్రాంచైజీలో మరో సినిమా తెరకెక్కించేందుకు రంగం సిద్ధమైంది. 'రాజు గారి గది 3' పేరుతో రూపొందబోతున్న తాజా మూవీలో తమన్నాను మెయిన్ లీడ్గా ఎంపిక చేశారు. జూన్ 20 ఈ చిత్రం అపీషియల్గా ప్రారంభోత్సవం జరుపుకుంది.
అయితే ఈ మూవీ ప్రారంభోత్సవం జరుపుకున్న వారంలోపే షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ చిత్రం నుంచి తమన్నా తప్పుకుందట. అయితే ఈ విషయమై తమన్నా నుంచి కానీ, దర్శకుడు ఓంకార్ నుంచి కానీ ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు.
ఆరు నెలల క్రితం అ సినిమాకు సంబంధించిన లైన్ ఓంకార్ చెప్పినపుడు తమన్నా చాలా ఇంప్రెస్ అయిందని, అయితే పూర్తి స్క్రిప్టు సినిమా ప్రారంభోత్సవం రోజే చెప్పారని తెలుస్తోంది. సినిమా ప్రారంభం అయిన తర్వాత కథ విన్న తమన్నా... స్క్రిప్టులో చాలా మార్పులు చేయడం, ముఖ్యంగా తన పాత్రలో ఊహించని విధంగా చేంజెస్ చేసిన విషయం గుర్తించి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుందట.
మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా తమన్నా మాట్లాడుతూ... 'రాజుగారి గది 3'లో మెయిన్ లీడ్ కోసం నన్ను తీసుకోవడం ఆనందంగా ఉంది, ఒక హీరోయిన్కు ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా లభిస్తాయి, ఈ మూవీ చేయడంపై చాలా ఎగ్జైట్మెంటుతో ఉన్నట్లు వెల్లడించారు. మరి ఇంతలోనే ఆమె తప్పుకున్నట్లు వార్తలు ప్రచారంలోకి రావడంతో అందరిలోనూ అయోమయం నెలకొని ఉంది. దీనిపై దర్శకుడు ఓంకార్ స్పందించాల్సి ఉంది.
ఓంకార్ దర్శకత్వంలో ఓక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై 'రాజుగారి గది 3' తెరకెక్కుతోంది. ఈ ఈ చిత్రంలో ఇంకా ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, హరితేజ, అజయ్ఘోష్ తదితరులు నటించనున్నారు. చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్, గౌతంరాజు ఎడిటింగ్, సాహి సురేశ్ ప్రొడక్షన్ డిజైనర్గా, వెంకట్ ఫైట్ మాస్టర్గా వర్క్ చేస్తున్నారు.