twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరక్టర్ తో నాకు ఆ సంభంధం లేదు...

    By Staff
    |

    Tanusree Datta
    బాలకృష్ణ వీరభద్ర సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ భామ తనుశ్రీ దత్తా. ఆమె హిందీ చిత్ర పరిశ్రమలో పెద్ద హిట్స్ లేకపోయినా గాసిప్స్ తో పాపులర్ అయి వరస ఆఫర్స్ తో ముందుకువెళ్తోంది. అక్కడ ఆమె సెమీ న్యూడ్ గా చేసిన ఆషిక్‌ బనాయా అప్నే పాటతో కుర్రకారును ఉర్రూతలూగించింది. ఆ పాటను ఒక సారి చూసి చూసిన వారు మరిచి పోవటం కష్టం. ఆమె తాజాగా ఈమె 'సాస్‌, బాహు ఔర్‌ సెన్సెక్స్‌లో నటించింది. పేరులో ఉన్న వైవిధ్యం సినిమాలోనూ, తన పాత్రలోనూ కనిపిస్తుందని ఆమె ధీమాగా చెబుతోంది. అలాగే ఇటీవల కొయినా మిత్రా సోదరుడు రచనా దూబేతో సన్నిహితంగా ఉంటోంది తనుశ్రీ.

    ఆయనతో కలిసే పార్టీలకు, పబ్‌లకు వెళ్తోంది. ఈ విషయాన్ని అడిగితే తనుశ్రీ ఇలా చెప్పింది... ''దూబే నాకు ఎంతో సన్నిహితుడైన మిత్రుడు. ఆయన తీయబోయే చిత్రంలో నటించబోతున్నాను. అందులో భాగంగా పలుమార్లు కథా చర్చల్లో పాల్గొన్నాను. అంతకు మించి మా మధ్య ఏమీ లేదు.ఆయనతో నాకు సంభంధం లేదు. ఏమిటో ఎంత చెప్పినా అపార్థం చేసుకొంటూనే ఉంటారు''. అంటూ దిగాలు పడిపోయింది.

    ఇక తనుశ్రీ ప్రస్తుతం 'రామా ది సేవియర్‌' అనే సినిమాలోనూ నటించడానికి సంతకం చేసింది. సెట్స్‌లో ఉన్న సహ నటీనటుల్ని లెక్కచేయదని ఈమె మీద ఓ అపవాదు ఉంది. దీనిపై ప్రశ్నిస్తే.. ''ఎవరన్నారు.. ఆ మాట? నా సన్నిహితులతో ఎలా మసలుకొంటానో నా యూనిట్‌ సభ్యులతోనూ ఇంచుమించు అలాగే ఉంటాను. ఎవరో లేనిపోనివి కల్పిస్తున్నారంతే'' అని చెప్పింది. ఏదైమైనా ఆమె తనుశ్రీ దత్తా కాదు తనుఫ్రీ దత్తా అనిపించుకుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X