Don't Miss!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'టపోరీ' టైటిల్ మహేష్ కా.. ప్రభాస్ కా?
హైదరాబాద్: పవన్ తో చేసిన గబ్బర్ సింగ్ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ నిర్మాతగా మారిన బండ్ల గణేష్ తాజాగా 'టపోరీ' అనే టైటిల్ ని ఎపి ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేసారు. తమ పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై రిజిస్టర్ చేసిన ఈ టైటిల్ మహేష్, ప్రభాస్ అభిమానుల్లో కలకలం రేపుతోంది. ఈ టైటిల్ తమ హీరోల్లో ఎవరకి పెట్టుబోతున్నారనే చర్చ మొదలైంది.
పూరీ జగన్నాధ్ కోసం ఈ టైటిల్ ని రిజిస్టర్ చేసినట్లు మరో ప్రక్క వినపడుతోంది. పూరీ కోసమైతే అది ఖచ్చితంగా మహేష్ కోసమే అయ్యింటని అంటున్నారు. పూరీ, బండ్ల గణేష్ కాంబినేషన్ లో మరో చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ తోనూ గణేష్ ఓ చిత్రం నిర్మించనున్నారు. దర్శకుడు ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. దాంతో ఈ టైటిల్ రిజిస్టర్ చేయటంతో అందరిలో ఆసక్తి మొదలైంది. ప్రస్తుతం అల్లు అర్జున్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో గణేష్ ఇద్దరు అమ్మాయిలతో చిత్రం రూపొందిస్తున్నారు.
'జులాయి' సినిమాతో తన జోష్ చూపించారు అల్లు అర్జున్. ఆకతాయి కుర్రాడిగా బన్నీ నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకొంది. ఇప్పుడు ప్రేమికుడి అవతారం ఎత్తుతున్నారు. ఒకేసారి ఇద్దరమ్మాయిల్ని ప్రేమలోకి దింపేస్తున్నారు. ఆ సినిమానే 'ఇద్దరమ్మాయిలతో'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లుఅర్జున్తో అమలాపాల్, కేథరిన్ ఆడిపాడనున్నారు. బండ్ల గణేష్ నిర్మాత. బ్యాంకాక్లో కీలకమైన సన్నివేశాలతో పాటు పాటలు తెరకెక్కిస్తారు. సింహభాగం విదేశాల్లోనే షూటింగ్ జరగనుంది. చాలాకాలం తరవాత పూరి తెరకెక్కిస్తున్న ప్రేమకథ ఇది. వినోదం, యాక్షన్ సన్నివేశాలకూ చోటుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.