Don't Miss!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Finance EPFO News: ఉద్యోగులకు గుడ్న్యూస్.. మారిన పీఎఫ్ విత్డ్రా రూల్స్.. ఎంతంటే..??
- News YS Jagan: జగన్ పై దాడి కేసులో ఇద్దరి అరెస్ట్-కాసేపట్లో కోర్టుకు..!
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
సూపర్ హిట్ దర్శకుడిపై అఖిల్ కన్ను? చేస్తానంటూ స్టేజీపై ప్రకటన
హైదరాబాద్: తొలి చిత్రం అఖిల్ తో డిజాస్టర్ అందుకున్న అఖిల్ తన తదుపరి చిత్రానికి ఏ దర్శకుడు అయితే బాగుంటుందనే విషయమై క్లారిటీకా రాలేకపోతున్నారు. మొన్నామధ్య కృష్ణగాడి వీర ప్రేమ గాధ దర్సకుడు హను రాఘవపూడితో ముందుకు వెళ్తానని ట్విట్టర్ సాక్షిగా ప్రకటించాడు. అయితే అనుకోకుండా సీన్ లోకి నితిన్ వచ్చాడు. హను,నితిన్ కాంబినేషన్ సెట్ అయ్యి మళ్లీ అఖిల్ రెండో చిత్రం దర్శకుడు పోస్ట్ ఖాళీ అయ్యింది.
ఈ నేపధ్యంలో అఖిల్ తన తదుపరి చిత్రం కోసం మనం దర్శకుడు విక్రమ్ కుమార్ తో ముందుకు వెళ్దామా అనుకున్నారు. ఈ మేరకు ఓ కథ కూడా విన్నారని సమాచారం. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆయనలో మళ్లీ డైలమో మొదలైందిట.
తనకు తగ్గ కథ కాదేమో అని, వేరే యంగ్ డైరక్టర్ తో ముందుకు వెళ్తే ఎలా ఉంటుందని, ఆయన ఆలోచిస్తున్నారుట. అందుకోసం ఆయన మరో దర్సకుడుతో మంతనాలు మొదలెట్టారని సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు..
రీసెంట్ గా చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది 'పెళ్లి చూపులు' చిత్ర దర్శకుడు. 'పెళ్లి చూపులు' సినిమా తెగ నచ్చటంతో దర్శకుడు తరణ్ భాస్కర్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అక్కినేని అఖిల్ ప్రకటించారు.
హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగిన 'పెళ్లి చూపులు' విజయోత్సవ సమావేశానికి అఖిల్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. 'పెళ్లి చూపులు' కథ, కథనాలు తనను ఎంతో ఆకర్షించాయని వివరించారు. చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.