Don't Miss!
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Sports ఆ నిర్ణయమే మమ్మల్ని గెలిపించింది- పంత్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జాంబీ రెడ్డి ఎఫెక్ట్.. రెమ్యునరేషన్ డోస్ పెంచిన తేజ సజ్జ
జాంబీ రెడ్డి సినిమాతో మొత్తానికి ఒక హిట్ అందుకున్న యువ నటుడు తేజ సజ్జ రెమ్యునరేషన్ డోస్ పెంచినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన జాంబీ రెడ్డి ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద కూడా పెట్టిన పెట్టుబడికి మంచి ప్రాఫిట్స్ అందించింది. ఇక అదే టీమ్ తో కలిసి హనుమాన్ అనే సినిమా చేస్తున్న ప్రశాంత్ వర్మ ఎదో పెద్ద ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.
హనుమాన్ సినిమాకు బడ్జెట్ హై లెవెల్లోనే ఉంటుందట. దీంతో హీరో రెమ్యునరేషన్ డోస్ పెంచినట్లు సమాచారం. మొన్నటి వరకు లక్షల్లో అందుకున్న తేజ సజ్జ ఇప్పుడు సడన్ గా కోటి రూపాయలను దాటించినట్లు తెలుస్తోంది. ఇక తేజ సినిమా కోసం ఫీట్నెస్ లో కూడా మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ముందుగానే హెయిర్ స్టైల్ ను కూడా సెట్ చేసుకున్నాడు. మరి హనుమాన్ సినిమాతో ఈసారి ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.
అలాగే తేజ మరో రెండు సినిమాలను కూడా లైన్ లో పెట్టాడు.కొన్ని నెలల క్రితం సూపర్ గుడ్ ఫిలిమ్స్ లో చేసిన 'ఇష్క్' అనే ఒక థ్రిల్లర్ సినిమాను భారీగా విడుదల చేయాలని అనుకున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్ కూడా గట్టిగానే చేశారు. కానీ కరోనా లాక్ డౌన్ వలన ఆ సినిమా వాయిదా వేశారు. ఇక వైజయంతి అబుబంధ సంస్థ స్వప్న సినిమాస్ లో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.