twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్‌లోకి సీఎం కేసీఆర్ మనవడు.. టాప్ డైరెక్టర్, నిర్మాత ప్రయత్నాలు.. హిమాంషు ట్వీట్‌తో రూమర్లకు చెక్!

    |

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మనవడిగా కల్వకుంట్ల హిమాంషు రావు మీడియాలో హైలెట్ అయ్యారు. పలు మార్లు అనేక వివాదాలకు కేంద్ర బిందువు అయ్యాడు. అయితే తాజాగా తనపై వస్తున్న రూమర్లకు, గాసిప్స్‌కు తెర దించే ప్రయత్నం చేస్తూ హిమాంషు చేసిన ట్వీట్ మీడియాలోను, సోషల్ మీడియాలోను హైలెట్ అయింది. అయితే హిమాంషు చేసిన ట్వీట్ ఇప్పుడు సాధారణ ప్రజలతోపాటు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. హిమాంషు రావు ట్వీట్ వివరాల్లోకి వెళితే..

    ప్రభుత్వ కార్యక్రమాల్లో హిమాంషు

    ప్రభుత్వ కార్యక్రమాల్లో హిమాంషు

    బాల్యంలోనే రాజకీయ వేదికలపై, ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాంషు ప్రత్యేక ఆకర్షణగా మారారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట పలు కార్యక్రమాల్లో అధికారికంగా పాలుపంచుకొన్నారు. సర్కారు కార్యక్రమాల్లో మైనర్ అయినటు వంటి హిమాంషును తీసుకెళ్లడం, ప్రోత్సహించడం ఏమిటని ప్రశ్నించారు. కొందరు రాజకీయ నేతలు హిమాంషును బాడీ షేమింగ్ కూడా పాల్పడ్డారు.

    మంత్రి కేటీఆర్ ఆవేదన

    మంత్రి కేటీఆర్ ఆవేదన

    అయితే తన కుమారుడు హిమాంషు రావును టార్గెట్ చేయడంపై మంత్రి కేటీఆర్ పలు సందర్బాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పిల్లవాడు అనే విషయాన్ని పట్టించుకోకుండా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టారు. అయితే కొద్దికాలంగా ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటూనే పర్యావరణం, పలు సామాజిక సమస్యలపై స్పందిస్తూ.. పిట్ట కొంచెం కూత ఘనం అనే రీతిలో ఆకట్టుకొంటున్నాడు.

    హిమాంషు రావు ట్వీట్‌ వైరల్

    హిమాంషు రావు ట్వీట్‌ వైరల్

    అయితే హిమాంషు రావు తాను రాజకీయాల్లొకి వస్తున్నట్టు వస్తున్న వార్తలపై ట్విట్టర్ ద్వారా ఖండించారు. ఓ విషయంపై నేను స్పష్టత ఇవ్వాలని అనుకొంటున్నాను. నేను ఎప్పుటికి రాజకీయాల్లోకి రాను. ఎందుకంటే నా జీవితంలో ఎన్నో లక్ష్యాలు, కలలను సాకారం చేసుకోనే దిశగా ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్యూ. సర్వేజన సుఖినోభవంతు అంటూ ట్వీట్ చేశారు. హిమాంషు చేసిన ట్వీట్‌పై నెటిజన్లు తలో విధంగా స్పందిస్తున్నారు.

    త్వరలో టాలీవుడ్‌లోకి ఎంట్రీ

    త్వరలో టాలీవుడ్‌లోకి ఎంట్రీ

    ఇదిలా ఉండగా, త్వరలోనే హిమాంషును టాలీవుడ్‌కు పరిచయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు సన్నిహితంగా ఉండే వాళ్లు హిమాంషును వెండితెరకు పరిచయం చేయాలన్న ఆలోచనతో ఉన్నట్టు సినీ వర్గాలో అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన గానీ, సంకేతాలు ఏమీ రాకపోవడంతో ఆ వార్తలో ఎంత మాత్రం నిజముందనే విషయంపై ఆరా తీస్తున్నారు.

    Recommended Video

    Potti Veeraiah ఇక లేరు | అప్పట్లో శోభన్ బాబు సలహాతో..!! || Filmibeat Telugu
    దిల్ రాజు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో

    దిల్ రాజు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో

    అయితే హిమాంశును హీరోగా పరిచయం చేయడానికి దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దిల్ రాజు సొంత బ్యానర్‌పై హిమాంశును వెండితెరకు పరిచయం చేస్తున్నట్టు కొన్ని వార్తలు సినీ వర్గాల్లో ప్రచారం అవుతున్నాయి. తాజా ట్వీట్ నేపథ్యంలో హిమాంషు లక్ష్యం సినిమా పరిశ్రమననే అనే వాదన మొదలైంది. అయితే హిమంషు, ఆయన కుటుంబం ఈ వార్తలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

    English summary
    Telangana Minister KTR son Himanshu Rao Kalvakuntla tweet goes viral. Himanshu Rao wrote that I just wanted to clear something, I will never enter politics because I have my dreams to pursue and goals to achieve. Thank you! Hope you have a great day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X