రామ్ చరణ్ తో మరోసారి తమన్ ఖరారు...
హైదరాబాద్ : రామ్ చరణ్ హిట్ చిత్రం నాయక్ కు సంగీతం అందించిన తమన్ మరోసారి చరణ్ తో చేయటానికి సైన్ చేసారు. నిర్మాత బండ్ల గణేష్ నిర్మించే కొరటాల శివ,రామ్ చరణ్ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని నిర్మాత బండ్ల గణేష్ తెలియచేసారు.
ఈ కాంబినేషన్ చిత్రం 31, మే 2013 న ప్రారంభం అయ్యింది. 'మిర్చి'తో ప్రేక్షకులకు మాస్ మసాలా వంటకాన్ని రుచి చూపించిన దర్శకుడు కొరటాల శివ. ఆయన దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా నటిస్తూండటంతో అభిమానుల ఆనందానికి అవధుల లేదు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బండ్ల గణేష్ నిర్మాత.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ''చరణ్తో సినిమా తీయాలని కొంతకాలంగా అనుకొంటున్నాం. ఇలా రూపుదాల్చింది. తప్పకుండా అందరికీ నచ్చేలా తీర్చిదిద్దుతాము''అన్నారు.


Click it and Unblock the Notifications












