Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నాగచైతన్య థాంక్యూ యూనిట్కి కొత్త టెన్షన్.. ఇప్పుడేం చేస్తారో ?
అక్కినేని నాగచైతన్య రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా థాంక్యూ. మనం, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన విక్రమ్ కే కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే దాదాపు కరోనా కారణంగా తెలుగులో అన్ని సినిమాలు షూటింగ్ లో ఆగిపోతున్నాయి. కానీ ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతున్న కారణంగా నిరాటంకంగా జరుగుతూ వస్తోంది. కానీ తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయిందని తెలుస్తోంది. నిజానికి మొదట ఎక్కువగా అక్కడ కరోనా కేసులు నమోదయ్యేవి. కానీ ఇప్పుడు పెద్దగా కేసులు నమోదు కావడం లేదు. అలాగే దాదాపు వాక్సినేషన్ ప్రక్రియ కూడా జోరుగా జరుగుతోంది.
భారత్ లో భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్న కారణంగా భారత్ నుంచి అక్కడికి వెళ్లే అన్ని విమాన మార్గాలు మూసివేశారు. కానీ ఈ సినిమా కథ ప్రకారం ప్రకాష్ సహా మరికొంత మంది నటులు ఈ సినిమా షూటింగులో పాల్గొనాల్సి ఉంది. మరో 1,2 రోజుల్లో వెళ్లి షూటింగులో పాల్గొంటారని భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు విమానయాన మార్గాలను మూసివేయడంతో ఇక్కడి నుంచి వెళ్లి అక్కడ షూటింగులో పాల్గొన లేని పరిస్థితి.. దీంతో ఇప్పటికే ఈ కాంబినేషన్ సీన్స్ కాకుండా మిగతా అన్ని సీన్స్ పూర్తయ్యాయి అని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కూడా నిలిచిపోయిందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేందుకు గాను యూనిట్ మరికొన్ని రోజులు అక్కడే వేచి ఉంటారా ? లేక అక్కడి నుంచి బయలుదేరి భారత్ వచ్చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇక నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా నటించిన లవ్ స్టోరీ సినిమా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 16వ తేదీన రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్న కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. మళ్లీ పరిస్థితులు కుదుటపడి థియేటర్ లో ఓపెన్ అయ్యాక ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.