Don't Miss!
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
మహేష్ అభిమానులకు బెస్ట్ గిఫ్ట్ రెడీ.. ఈ న్యూ ఇయర్ వేడుకలు మోగిపోవాల్సిందే!
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకునే ఓ వార్త బయటకొచ్చింది. ఆయన తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు గురించిన ఓ అప్డేట్ ఆసక్తికరంగా మారింది. ఈ సారి న్యూ ఇయర్ వేడుకలు దద్దరిల్లి పోయేలా మహేష్ టీమ్ స్కెచ్ వేసిందట. ఇంతకీ ఆ స్కెచ్ ఏంటి? మహేష్ అభిమానులు ఏ మేర పండగ చేసుకోవచ్చు? వివరాల్లోకి పొతే..
'సరిలేరు నీకెవ్వరు'లో ఐటెం సాంగ్
ప్రేక్షకలోకానికి పూనకం తెప్పించేలా 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ఓ ఐటెం సాంగ్ ప్లాన్ చేశారట దర్శకనిర్మాతలు. ఇప్పటికే ఈ ఐటెం సాంగ్ చిత్రీకరణ కూడా జరిగిపోయిందని తెలుస్తోంది. ఇందులో మహేష్ బాబుతో పాటు పూజా హెగ్డే చిందులేసిందని ఫిలింనగర్ టాక్.
మహేష్ అభిమానులకు ఇదే బెస్ట్ గిఫ్ట్
ఈ ఐటెం సాంగ్ కేకలు పెట్టించేలా మునుపెన్నడూ చూడని విధంగా ఫాస్ట్ బీట్తో అదరగ్గొట్టేస్తుందని లేటెస్ట్ సమాచారం. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా పరంగా చూస్తే మహేష్ బాబు అభిమానులకు ఇదే బెస్ట్ గిఫ్ట్ అని అంటోందట చిత్రయూనిట్. ఈ సాంగ్ విని థియేటర్స్లో ప్రేక్షకులు ఉగిపోవాల్సిందే అనే టాక్ వినిపిస్తోంది.
న్యూ ఇయర్ వేడుకలు.. మోగిపోవాల్సిందే మరి
ఇక ఈ ఏడాది డిసెంబర్ ఎండింగ్, వచ్చే ఏడాది జనవరి స్టార్టింగ్ లో వచ్చే న్యూ ఇయర్ వేడుకల్లో ఈ పాటదే హంగామా అంతా అంటున్నారు కొందరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పాటతోనే న్యూ ఇయర్ సంబరాలు చేసుకుంటారని అంటున్నారు. అంటే ఈ లెక్కన ఈ సాంగ్ ఏ రేంజ్లో ఉండనుందో అర్థం చేసుకోవచ్చు. అతి త్వరలో ఈ సాంగ్ విడుదల కానుందని సమాచారం.
Recommended Video
సరిలేరు నీకెవ్వరు మూవీ
అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్ సినిమాగా 'సరిలేరు నీకెవ్వరు' మూవీ రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది. చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి ముఖ్యపాత్ర పోషిస్తోంది. భారీ అంచనాల నడుమ జనవరి 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.