twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మణిరత్నం రావణ్(విలన్) కథ కరెక్టుగా ఇదే...

    By Srikanya
    |

    పోలీస్ ఆఫీసర్ దేవ్‌ప్రసాద్ (పృధ్వీ) క్లాసికల్ డాన్సర్ రాగిణి(ఐశ్వర్య రాయ్)తో ప్రేమలో పడి పెళ్ళిచేసుకుంటాడు. ఆతర్వాత ట్రాన్సఫరై నార్త్ ఇండియా లోని లాల్ మిట్టా అనే చిన్న టౌన్ కి వెళ్ళతారు. అక్కడ పోలీస్ వ్యవస్ధ అనేది నామమాత్రంగా పనిచేస్తూంటుంది. ఆ ఊరిలో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతూంటాడు వీరయ్య అలియాస్ వీరా(విక్రమ్). వీరయ్య ఓ గిరిజనుడు. అక్కడ పరిస్ధితులు గమనించిన దేవ్ ..అక్కడ వారి నాయకుడు వీరాని మట్టుపెడ్తే సమస్యలన్నీ ఓ కొలిక్కి వస్తాయని భావించి..పోరాటం ప్రారంభిస్తాడు. వీరా..మనిషి ప్రియమణి దేవ్ ప్రసాద్ చేతిలో మరణిస్తుంది. దెబ్బ తిన్న వీరా...దేవ్ భార్య రాగిణిని తీసుకుని అడవిలోకి పారిపోతాడు. ఆమెని వెతుక్కుంటూ దేవ్ బయిలుదేరతాడు. ఆ అడవి చాలా కన్ఫూజింగ్ గా భయపెట్టదిగా, దట్టంగా ఉంటుంది. ఆ క్రమంలో రకరకాల సంఘటనలు ఎదుర్కోవాల్సివస్తుంది. అతనికి త్రాగుబోతు పారెస్ట్ గార్డు (గోవిందా) సాయిపడతాడు. ఎదురైన పరిస్థితులు ఏమిటనేవి ఈ చిత్రంలోని ప్రధానాంశం. వీరాగా విక్రమ్, దేవ్ ‌గా పృథ్వీరాజ్, రాగిణిగా ఐశ్వర్య నటించిన ఈ చిత్రంలో ప్రియమణి, ప్రభు, కార్తీక్ కీలక పాత్రలను పోషించారు. మద్రాస్ టాకీస్ పతాకంపై నిర్మాణమైన 'విలన్' చిత్రం ఈ నెల 18న విడుదలకు సిద్ధమవుతోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X