Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మణిరత్నం రావణ్(విలన్) కథ కరెక్టుగా ఇదే...
పోలీస్ ఆఫీసర్ దేవ్ప్రసాద్ (పృధ్వీ) క్లాసికల్ డాన్సర్ రాగిణి(ఐశ్వర్య రాయ్)తో ప్రేమలో పడి పెళ్ళిచేసుకుంటాడు. ఆతర్వాత ట్రాన్సఫరై నార్త్ ఇండియా లోని లాల్ మిట్టా అనే చిన్న టౌన్ కి వెళ్ళతారు. అక్కడ పోలీస్ వ్యవస్ధ అనేది నామమాత్రంగా పనిచేస్తూంటుంది. ఆ ఊరిలో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతూంటాడు వీరయ్య అలియాస్ వీరా(విక్రమ్). వీరయ్య ఓ గిరిజనుడు. అక్కడ పరిస్ధితులు గమనించిన దేవ్ ..అక్కడ వారి నాయకుడు వీరాని మట్టుపెడ్తే సమస్యలన్నీ ఓ కొలిక్కి వస్తాయని భావించి..పోరాటం ప్రారంభిస్తాడు. వీరా..మనిషి ప్రియమణి దేవ్ ప్రసాద్ చేతిలో మరణిస్తుంది. దెబ్బ తిన్న వీరా...దేవ్ భార్య రాగిణిని తీసుకుని అడవిలోకి పారిపోతాడు. ఆమెని వెతుక్కుంటూ దేవ్ బయిలుదేరతాడు. ఆ అడవి చాలా కన్ఫూజింగ్ గా భయపెట్టదిగా, దట్టంగా ఉంటుంది. ఆ క్రమంలో రకరకాల సంఘటనలు ఎదుర్కోవాల్సివస్తుంది. అతనికి త్రాగుబోతు పారెస్ట్ గార్డు (గోవిందా) సాయిపడతాడు. ఎదురైన పరిస్థితులు ఏమిటనేవి ఈ చిత్రంలోని ప్రధానాంశం. వీరాగా విక్రమ్, దేవ్ గా పృథ్వీరాజ్, రాగిణిగా ఐశ్వర్య నటించిన ఈ చిత్రంలో ప్రియమణి, ప్రభు, కార్తీక్ కీలక పాత్రలను పోషించారు. మద్రాస్ టాకీస్ పతాకంపై నిర్మాణమైన 'విలన్' చిత్రం ఈ నెల 18న విడుదలకు సిద్ధమవుతోంది.