Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాధేశ్యామ్ కోసం ఏకంగా ట్రైన్ సెట్.. తెరవెనుక వందలాదిమంది కష్టం.. ఖర్చు ఎంతంటే?
బాహుబలి తరువాత ప్రభాస్ సాహో సినిమాతో అభిమానులను పూర్తి స్థాయిలో అయితే మెప్పించలేదు. అందుకే రాధేశ్యామ్ సినిమాతో సింపుల్ గా వచ్చి పవర్ఫుల్ హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు. పిరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. ఇక సినిమా క్వాలిటీ విషయంలో కూడా నిర్మాతలు ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదని తెలుస్తోంది. కొన్ని ముఖ్యమైన సీన్స్ కోసం ఏకంగా ట్రైన్ సెట్ ను నిర్మించారట.
ప్రేమతో అడ్వెంచర్
అయితే ఒక విదంగా ఈ సినిమాపై అభిమానుల్లో ఊహించని విధంగా అంచనాలు పెరగకుండా చూసుకుంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ప్రభాస్ అనగానే యాక్షన్ సీన్స్ తప్పకుండా ఉంటాయని అనుకోవడం కామన్. కానీ రాధేశ్యామ్ పిరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది కాబట్టి రొమాంటిక్ అడ్వెంచర్ పార్ట్ సినిమాలో సరికొత్త కిక్కిస్తుందని సమాచారం.
ఆ సీన్స్ చాలా కీలకమని..
ఈ సినిమాలో ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ లలో నటిస్తాడాని పోస్టర్స్ ద్వారా చాలా ఈజీగా అర్ధమయ్యింది. ఇక సినిమా టీజర్ ఇటీవల పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ టాపిక్ లీక్ అయ్యింది. సినిమాలో ట్రైన్ సీన్స్ చాలా కీలకమని తెలుస్తోంది.
1970లలో కొనసాగే కథ..
మోషన్ పోస్టర్ లోనే కాకుండా ఫస్ట్ టీజర్ లో కూడా ట్రైన్ బ్యాక్ డ్రాప్ ఉన్నట్లు చాలా క్లారిటీగా అర్ధమయ్యింది. సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే , ప్రభాస్ మొదట ట్రైన్ సీన్స్ తోనే పరిచయం అవుతారట. కథకు చాలా ముఖ్యమైన ట్రైన్ కోసం దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 1970ల కాలం నాటి ట్రైన్ ను అలాగే అప్పటి రైల్వేస్టేషన్ వాతావరణాన్ని సరికొత్తగా ప్రజెంట్ చేశారట.
భారీ ఖర్చుతో ట్రైన్ సెట్..
స్పెషల్ గా ట్రైన్ సెట్ కోసం 250మంది వర్కర్స్ పని చేశారట. అన్నపూర్ణ స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ రవీంధర్ రెడ్డి క్రియేట్ చేసిన ఆ సెట్ కోసం దాదాపు 1.6కోట్ల వరకు ఖర్చు చేశారని తెలుస్తోంది. సినిమాలో క్లైమాక్స్ సీన్ కూడా ట్రైన్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుందట. తప్పకుండా సినిమా ఒక సరికొత్త ఫీల్ ను కలిగిస్తుందని అంటున్నారు. ఇక సినిమాను జూలై 30న విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.