Don't Miss!
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బ్లాక్ బస్టర్ సినిమా రీమేక్.. రవితేజ మొదలుపెట్టేది అప్పుడే!
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తేరి చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఉన్న సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం గురించి తాజాగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.
సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెల్ళబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రవితేజ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలోని అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఓ కొలిక్కి వచ్చాక తేరి రీమేక్ మొదలు పెట్టాలని రవితేజ భావిస్తున్నాడు.
ఇదిలా ఉండగా ఆ మధ్యన ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తలు ప్రచారం జరిగాయి. ఈ ఊహాగానాలకు తెర పడాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన రావాలి. సంతోష్ శ్రీనివాస్ తేరి కథని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి రెడీగా ఉన్నాడట. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.