Don't Miss!
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- News టీడీపీ నేతలకు చేదు అనుభవం..మహిళ ప్రశ్నలకు బిత్తరపోయిన నాయకులు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Finance Gold Price: శుభవార్త.. ఆకాశం నుంచి విరిగిపడ్డ బంగారం ధర.. షాపింగ్ షురూ చేసేయండి..
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
విజయ్ దేవరకొండ అందుకే హ్యాండిచ్చాడట.. షాకింగ్ ట్వీట్..
అర్జున్రెడ్డి సినిమా తర్వాత హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ దక్షిణాదిలో భారీగానే పెరిగిపోయింది. ఆ చిత్రం తర్వాత విడుదలవుతున్న విజయ్ దేవరకొండ సినిమా ఏ మంత్రం వేశావే. తన చిత్రం విడుదల నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఎక్కడ ప్రమోషన్లో పాల్గొనడం గానీ, సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్టు గానీ కనిపించలేదు. కానీ ఈ సినిమా గురించి షాకింగ్ కామెంట్ను ట్విట్టర్లో ట్వీట్ చేసినట్టు వార్తలు వచ్చాయి.
2013లోనే షూటింగ్
ఏ మంత్రం వేసావే చిత్ర విడుదల నేపథ్యంలో విజయ్ దేవరకొండ గురించి ఓ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. ఏ మంత్రం వేసావే చిత్రం 2013లో ప్రారంభమైంది. సగం పూర్తయిన తర్వాత డేవిడ్ ఫిచర్ రూపొందించిన హాలీవుడ్ చిత్రం ది గేమ్ అని గుర్తించాడట. అయితే అప్పుడప్పుడే నటుడిగా గుర్తింపు పొందుతున్న నేపథ్యంలో ఆ చిత్రాన్ని పూర్తి చేశాడు.
వర్కవుట్ కాదని ఆపారట
ఏ మంత్రం వేసావే చిత్రం ముందు విజయ్కి పెద్దగా క్రేజ్ లేదు. ఆ సినిమాతో హీరోగా గుర్తింపు వస్తుందనే ఉద్దేశంతో 2013లోనే సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలను కోరాడు. కానీ ఆ సమయంలో విడుదల చేస్తే కమర్షియల్గా వర్కవుట్ కాదు అని నిర్మాతలు భావించారు అని కథనంలో పేర్కొన్నారు.
అర్జున్రెడ్డి సినిమా తర్వాత
ఇక అర్జున్రెడ్డి రిలీజ్ తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. వరుస చిత్రాలతో బిజీ అయిపోయాడు. పలు భాషల్లో నటించే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో ఏ మంత్రం వేసావే రిలీజ్ చేస్తే బాగుంటుంది అని నిర్మాతలు భావించారు.
|
ప్రమోషన్కు దూరం
ఏ మంత్రం వేసావే చిత్రం రిలీజ్ నేపథ్యంలో సినిమాను ప్రమోట్ చేస్తారని అంతా భావించారు. కానీ విజయ్ దేవరకొండ తన షూటింగ్లో బిజీ అయిపోయారు. కానీ ఏ మంత్రం వేసావే చిత్రం తనకు బ్యాక్లాగ్ లాంటింది అని సినిమా గురించి విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు. కానీ విజయ్ ట్వీట్ చేసింది మాత్రం ఐదేళ్ల క్రితం నటించిన ఓ య్యూటూబ్ గురించి అని స్పష్టమవుతున్నది.
పొలిటీషియన్గా నోటాలో
ప్రస్తుతం విజయ్ దేవరకొండ తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న నోటా అనే చిత్రంల నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన సరసన మెహరీన్ పిర్జాదా నటిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ రాజకీయవేత్తగా నటిస్తున్నట్టు రూమర్లు షికారు చేస్తున్నాయి.