Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
మగధీరకు ఒక్కడైరెక్టరైతే ‘జగదేకవీరుని’కి ముగ్గురు డైరక్టర్లు!?
'జగదేకవీరుడు అతిలోకసుందరి" రెండు దశాబ్ధాలు పూర్తి చేసుకోవడంతో ఆ చిత్ర నిర్మాత అశ్వనీదత్..ఈ చిత్రానికి త్వరలో సీక్వెల్ ఉంటుందని త్వరలో దానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తాననీ తెలపడంతో ఇప్పుడు ఆ సీక్వెల్ పై రకరాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇంకా హీరో హీరోయిన్లు, దర్శకుడు, ఇతర టెక్నీషియన్లు వివరాల్ని అశ్వనీదత్ ప్రకటించకపోవడంతో రకరకాల గాసిప్ లు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.
వీటిలో కొన్ని మచ్చుకకి ఆ చిత్రంలో చిరంజీవి చేస్తే ఈ చిత్రంలో అతని తనయుడు చేస్తాడనేది ఒక గాసిప్ అలాగే ఆ చిత్రంలో నటించిన శ్రీదేవి కూతురు ఈ చిత్రంతో ఎంట్రీ ఇవ్వనుందని మరో గాసిప్. మరో ముఖ్యమైన విషయమేంటంటే ఆ చిత్రానికి దర్శకత్వం వహించింది రాఘవేంద్రరావు అయితే ఈ చిత్రానికి అతని తనయుడు ప్రకాష్ దర్శకత్వం చేయనున్నాడని అది కూడా ప్రక్కన రాఘవేంద్ర రావు పర్యవేక్షణ ఉంటుందని అక్కడక్కడా వినిపిస్తున్నాయి.
అయితే ఈ చిత్రానికి మరో ఇద్దరి దర్శకుల పేర్లు కూడా వినబడుతున్నాయి. వారిలో ఒకరు రామ్ చరణ్ తో చిత్రరికార్డులను నెలకొల్సిన రాజమౌళి అయితే మరో డైరక్టర్ చిరుతో అద్భుత గ్రాఫిక్ కళాఖండాన్ని రూపొందించిన 'అంజి" చిత్ర దర్శకుడు కోడిరామకృష్ణ. ఎప్పటి నుండో వైజయంతీ బ్యానర్ దర్శకుడు రాజమౌళితో ఓ చిత్రం చేయాలని చూస్తున్న విషయం తెలిసిందే. మరీ ఈ మెగా మూవీ అతనినే వరిస్తుంది? లేక 'అరుంధతి" తో సంచలన విజయాన్ని అందించిన కోడి రామకృష్ణకి ఆ అవకాశం వరిస్తుందా? లేదా వీరిద్దరిని కాదని గత చిత్రాన్ని రూపొందించిన రాఘవేంద్రరావుకే ఆ అవకాశం వరిస్తుందో వేచి చూడాలి. వీటన్నింటికీ సమాధానం ఒక్క అశ్వనీదత్ దగ్గరే ఉంది. మరి ఆయన ఈ గాసిప్స్ లో నిజానిజాలెంతో తేలాల్చి ఎప్పుడు వివరాలు వెల్లడిస్తారు వేచి చూడాల్సిందే.